శ్రీశైలం, ఫిబ్రవరి 14 : శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మోత్సవ సందడి నెలకొన్నది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అం గరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు మంగళవారం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరో పీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోదైన శ్రీశైల మహాక్షేత్ర మాడ వీధుల్లో సాయంత్రం మయూర వాహనంపై ఉరేగుతూ స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు. ప్రత్యేకంగా అలంకరించిన మ యూర వాహనంపై భ్రామరి, మల్లికార్జునస్వామిని వేం చేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు చేశారు.
మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో ఆలయోత్సవంతోపాటు క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. భ్రామరి సమేతుడైన శ్రీశైలేశుడు త్రిశూలధారియై మయూర వాహనంపై విహరించా రు. తెలంగాణ, ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ నుంచి భక్తులు తరలివచ్చారు. కళాకారుల వేషాలు, డప్పు చప్పుళ్ల మధ్య గ్రామోత్సవం శోభాయమానంగా జరిగింది. మయూర వాహనంపై ఉన్న ఆదిదంపతులను భక్తులు దర్శించుకొని తన్మయత్వం చెందారు. భక్తులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి.
పట్టు వస్ర్తాలు సమర్పణ..
భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణోత్సవానికి టీటీడీ, కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానం నుంచి ప ట్టు వస్ర్తాలు సమర్పించారు. ఉదయం కాణిపాక దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు మోహన్రెడ్డి, ఈవో వెంకటేశ్లు ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకోగా శ్రీశైలం ట్రస్ట్బోర్డ్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు విజయలక్ష్మి సుబ్బరాయు డు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సాయంత్రం టీటీడీ తరఫున ధర్మకర్తల మండలి సతీమణి వై.స్వర్ణలతారెడ్డి, జేఈవో వీరభ్రహ్మం దంపతులు, వేదపండితులు, అధికారులు పట్టువస్ర్తాలను అమ్మ, స్వామికి సమర్పించారు. వేడుకల్లో అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్, ఈఈ రామకృష్ణ, పీఆర్వో శ్రీనివాసరావు, ఏఈవోలు హరిదాస్, ఫణీందర్ ప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకుడు అనిల్కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న, అధికారులు పాల్గొన్నారు.