శ్రీశైలం, మార్చి 7 : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. పదకొండు రోజులపాటు నవవాహ్నిక దీక్షతో పూజాధికాలు శాస్ర్తోక్తంగా నిర్వహిస్తున్నారు. ఏడోరోజైన గురువారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణం, రుద్ర, చండీహోమాలు నిర్వహించారు. సాయంత్రం హోమాల అనంతరం స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన గజ వాహనంపై ఊరేగించారు. అదేవిధంగా గ్రామోత్సవ కార్యక్రమం గంగాధర మండపం నుం చి నంది మండపం వరకు, అక్కడి నుంచి బయలువీరభధ్ర స్వామి వరకు ఆ ద్యంతం నయనానందకరంగా సాగింది.
చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడోలు, నందికోళసేవ, ఢమరుకం, చిడుతలు, శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాలతో కొనసాగింది. ఉత్సవాల అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు స్వామి, అమ్మవార్లకు ఆస్థాన సేవ నిర్వహించారు. కా ర్యక్రమంలో ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కార్యనిర్వాహణాధికారి పెద్దిరాజుతోపాటు, ధర్మకర్తల మండలి స భ్యులు, ఈఈ రామకృష్ణ, పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈవో హరిదాస్తోపాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.