శ్రీశైలం, మార్చి 10 : శ్రీగిరి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పదకొండో రోజు పంచాహ్నిక దీక్షతో నిత్యం భ్రమరాంబిక మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు, అలంకారాలు భ క్తులను కనువిందు చేస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం చండీశ్వరస్వామికి షోడశోపచార క్రతువులు చేసిన అనంతరం ఈవో పెద్దిరాజు, చైర్మన్ చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో రుద్రహోమం, పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూ జాధికాలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయ పుష్కరిణిలో వైదిక శాస్ర్తోక్త అవబృతస్నానం చేయించిన త ర్వాత వసంతోత్సవాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి రోజున స్వామిఅమ్మవార్లకు కల్యాణం జరిపిన తరువాత సంప్రదాయం ప్రకారం పార్వతీదేవికి మెట్టెలు న ల్లపూసలు సమర్పించే నాగవల్లి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిత్యకల్యాణ మండపంలో సదస్యం జరిగిన తరువాత ఉత్సవ మొదటిరోజు దేవతాహ్వానానికి ధ్వజపట అవరోహణ కార్యక్రమం నిర్వహించారు.
పట్టువస్ర్తాలు సమర్పణ..
శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామి నుంచి శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టువస్ర్తాలు సమర్పించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. మార్చి 3నుంచి 16 వరకు జరిగే శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలకు ఆదివారం శ్రీశైల దేవస్థా నం తరఫున ఏఈవో మోహన్ అర్చక వేదపండితులు పట్టుపస్ర్తాలను సమర్పించారు. సోమవారం భ్రామరి, మల్లికార్జునుడికి ఆశ్వవాహన సేవ ఉంటుందని ఈవో తెలిపారు. శ్రీకాళహస్తీ దేవస్థానం ఈవో నాగేశ్వరరావు అర్చకవేద పండితులు పాల్గొన్నారు.