వనపర్తి, డిసెంబర్ 26 : జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మంగళవారం మహామండల పూజ నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి రమేశ్శర్మ సిద్ధాంతి, ముత్తుస్వామి, నరేందర్, గట్టు వెంకన్న, ఆలయ కమిటీ అధ్యక్షుడు నగే శ్ ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి ఆలయంలో ఉద యం నుంచి అయ్యప్పస్వామికి సుప్రభాత సేవ, అష్టఅభిషేకాలు, చక్రస్నానం, పల్లకీసేవ, పదునెట్టంపడి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష చాలా కఠినమైనదని, ఈ దీక్షతో మనిషి జీవన ప్రయాణంలో ఎన్నో మార్పులు చేసుకుంటాయన్నారు. స్వాములు మండల దీక్ష అనంతరం చేసే శబరియాత్ర సురక్షితంగా సాగాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉంది, స్వాము లు స్వీయరక్షణతో, మాస్కులు ధరించి కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూ చించారు. అంతకుముందుకు నారీ కేళ స్వాములను శాలువాలతో సన్మానించారు. అనంతరం అయ్యప్పమాలధారులతో కలిసి భిక్ష స్వీకరించారు. కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు వాకిటి శ్రీధర్, లక్ష్మీనారాయణ, రఘునాథ్రెడ్డి, ప్రకాశ్, నందిమల్ల అశోక్, అనిల్, పుట్టపాకల మహేశ్, శ్యామ్, ఆవుల రమేశ్, జోగు శాంతన్న, రాజశేఖర్, గౌస్, రమేశ్, నిరంజన్ పాల్గొన్నారు.