మహబూబ్నగర్: జిల్లా కేంద్రాన్ని కనీవిని ఏరుగని రీతిలో అద్భుతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి చౌరస్తా వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన ప్రత్యేకం గా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధి పనులు తలమానికంగా ఉండాలని, ఎక్కడ ఎలాంటి సమ స్యా లేకుండా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు.
జంక్షన్ల అభివృద్ధి పూర్తి స్థాయిలో వేగంగా జరిగేం దుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ.నర్సింహులు, మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.