మహబూబ్నగర్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కనుసన్నల్లో బీ ఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతోంది. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పార్టీ మారాలని.. లేకపోతే సంబంధంలేని విషయాల్లో కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. సోషల్ మీడియాలో భావ స్వేచ్ఛ ప్రకటన లేకుండా చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేపై ఎవరై నా కామెంట్లు పెడితే వెంటనే పీఎస్ నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. ఎమ్మెల్యే చె ప్పిండు.. పార్టీ మారాలని.. లేకపోతే మీ ఇష్టం అంటూ.. ఓ ఎస్సై బెదిరింపులకు పాల్పడుతున్నారు. పార్టీ మారకుంటే ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 వేల ఓట్ల స్వల్ప తేడాతో తమ నేత ఓటమి పాలు కావడంతో ఆ నియోజకవర్గమం తా ఇప్పుడు కన్నీళ్లు పెడుతోంది. అధికార పార్టీ నాయకులు బెదిరించినా..? దాడులు చేసినా..? అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా పోలీసులను ఇండ్ల మీదకు పంపించినా గులాబీ పార్టీ శ్రేణులు మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి నేతలకు, కార్యకర్తలకు బాసటగా నిలుస్తూ ధైర్యం చెబుతున్నారు. ఏ ఘటన జరిగినా అక్కడికి వెళ్తూ వారిలో మనోధైర్యం నింపుతున్నారు. దేవరకద్రలో అరాచక పర్వంపై ప్రత్యేక కథనం..

బీఆర్ఎస్ నేతలే టార్గెట్
దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరితంగా రాజకీయం చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. మాట వినకుం టే అక్రమ కేసు నమో దు చేసి భయ
పెట్టడం ఇక్కడ పరిపాటిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? లేదంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపాలా? అని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో బీఆర్ఎస్ నేతలకు రక్షణ లేకుండా పో యింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతున్న అధికార పార్టీ దాష్టికాలను ధైర్యంగా ఎదుర్కొంటున్నా రు. నియోజకవర్గంలో అనేక మండలాల్లో ఇప్పటికే కేసులు న మోదు కాగా.. మరి కొందరిపై దాడి చేయడం.. పోలీస్ స్టేషన్ల కు పిలిపించి బెదిరించడం.. నిత్యకృత్యంగా మారింది. తమపై దాడి జరిగింది అని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు ఉల్టా కాంగ్రెస్ ఫిర్యాదులపై కేసులు పెట్టి చట్టా న్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఎమ్మెల్యే గుప్పిట్లో ఇంటెలిజెన్స్
ఎమ్మెల్యే జీఎంఆర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ ఆయా మండలాల్లో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో ఏం జరుగుతుందో వెంటనే ఆయనకు చేరవేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కన్నా ఇంటెలిజెన్స్ వ్యవస్థపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని సమాచారం. పలానా గ్రామంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులను పార్టీలోకి తీసుకోవాలని.. వీళ్లు చెబితే క్షణాల్లో పోలీస్ అధికారుల నుంచి ఫోన్లు వెళ్తాయి. ఎమ్మెల్యే చెప్పిండు పార్టీ మారాలి.. లేకపోతే మీ ఇష్టం అంటూ.. నేరుగా వార్నింగ్లు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలోని ఓ ఎస్సై ఏకంగా పీఎస్ను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఆ పీఎస్ పరిధిలోని అధికార పార్టీ నేతల ఫోన్లు చేస్తే క్షణాల్లో ఆ ఎస్సై రెస్పాండై బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు ముగ్గురిపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం గమనార్హం. భూత్పూర్ మండలంలో బీఆర్ఎస్ నేతపై దాడి జరిగితే కారణమైన కాంగ్రెస్ మండల నేతలపై తూతూ మంత్రంగా కేసు పెట్టినా నేటికీ అదుపులోకి తీసుకోలేదు. అడవి అజిలాపురానికి చెందిన హమాలీలను.. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతిస్తే ఓ హత్య కేసులో నిందితులుగా చేర్చుతామాని భయపెట్టారు. దీంతో అక్కడ సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి ఆ ఎస్సై పార్టీ కార్యకర్తలా మారడం విమర్శలకు తావిస్తోంది. ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రెండేండ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులపై మూడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. సోషల్ మీడి యా పోస్టులు పెట్టిన వారికి ఫోన్ చేసి భయపెట్టడం ఆయన పనిగా పెట్టుకున్నారు.
ఎమ్మెల్యే అండదండలతో రెచ్చిపోతూ..
దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అండదండలతో నాయకులు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనేకచోట్ల కాంగ్రెస్కు పరాభవం ఎదురైంది. ఎమ్మెల్యే జీఎంఆర్ సొంత గ్రామంలో బీఆర్ఎస్ మద్దతిచ్చిన సర్పంచ్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడంతో ఆ పార్టీ పరువు పూర్తిగా పోయింది. ఆయా గ్రామాల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులను వేధించడం మొదలైంది. ఈ లోపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అక్కడక్కడ సత్తా చాటిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను టార్గెట్ చేసి పార్టీలో బలవంతంగా చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. బెదిరించి నియోజకవర్గంలో అరాచక పర్వానికి తెర లేపుతున్నారు. పోలీస్ ఇంటలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా బీఆర్ఎస్ నేతలపై ఉపయోగిస్తూ చిన్న చిన్న వాటికి కేసులు పెడుతున్నారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఇంటలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా అనుకూలంగా మార్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా మండలాల్లో నియమించిన పోలీస్ యంత్రాంగం మొత్తం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దర్శనమివ్వడం ఇందుకు నిదర్శనం.
అందరి లెక్కలు తేలుస్తాం..
ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి న్యాయవాద చదువును కేసులు పెట్టడానికి వాడుతున్నారు. ఏ సెక్షన్లు పెట్టాలో కూడా పోలీసులకు ఆయనే సూచిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి కేసులతో బీఆర్ఎస్ నాయకులకు వేధిస్తున్నారు. అప్పంపల్లి సర్పంచ్గా భారీ మెజారిటీ గెలవడం, కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడంతో అక్రమ కేసు పెట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలో వందకు పైగా అక్రమ కేసులు పెట్టి మా కార్యకర్తలు, నాయకులను జైలుకి పంపిస్తున్నారు. వాట్సాప్లో ఫార్వర్డ్ చేసినందుకు కూడా కేసులు పెడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను పార్టీ మార్పించే బాధ్యతను ఎమ్మెల్యే పోలీసులకు అప్పగించారు. బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులు గుర్తు పెట్టుకోండి…ఎవ్వరిని వదిలిపెట్టం… రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే…అందరి లెక్కలు తేలుస్తాం.. ఇప్పటికైనా కేసులు, వేధింపులు, బెదిరింపులు మానుకోండి..
– ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో బీఆర్ఎస్పై కేసులు
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు నమోదైన కేసులు