అయిజ, జూలై 29 : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతున్నది. డ్యాంలో 20గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం డ్యాంకు ఇన్ఫ్లో 59,730, అవుట్ఫ్లో 59,730 క్యూసెక్కులు నమోదైంది. 105.788టీఎంసీల నీటి నిల్వకుగానూ ప్రస్తుతం 102.696 టీఎంసీలు ఉన్నట్లు ఎస్ఈ శ్రీకాంత్రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో 94,840 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 94,300 క్యూసెక్కులుగా నమోదైంది. ఎగువ నుంచి వచ్చే వరద ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆయకట్టుకు 540 క్యూసెక్కుల నీరు వదిలినట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 12.7 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
సుంకేసులకు పెరిగిన ఇన్ఫ్లో
రాజోళి, జూలై 29 : సుంకేసుల జలాశయానికి వరద పెరిగింది. జలాశయానికి 44,311 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, 11 గేట్ల నుంచి 43,494 క్యూసెక్కులు దిగువన ఉన్న శ్రీశైలానికి వదిలారు. అలాగే 817 క్యూసెక్కులు కేసీ కెనాల్కు విడుదల చేశారు.
జూరాలకు తగ్గిన వరద..
అమరచింత, జూలై 29 : జూరాల రిజర్వాయర్కు వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం సాయంత్రానికి 19 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. విద్యుదుత్పత్తి కోసం 7,347 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. కుడి కాలువకు 437, ఎడుమ కాలువకు 920 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తం 11,120 క్యూసెక్కులు అవుట్ఫ్లో నమోదైంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు..
శ్రీశైలం, జూలై 29 : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద తగ్గుతున్నది. శుక్రవారం జూరాల నుంచి 7,347, సుంకేసుల నుంచి 43,494 క్యూసెక్కులు విడుదల కాగా.. సా యంత్రానికి 39,642 క్యూసెక్కులు శ్రీశైలం డ్యాంలో ఇన్ఫ్లో నమోదైంది. ఏపీ పవర్హౌస్లో 24,330, టీఎస్ పవర్హౌస్లో 31,784 క్యూసెక్కులతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 183.419 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.