వంగూరు, జూలై 22 : నిరాధారమైన ఆరోపణలు మాని దమ్ముంటే నాపై గెలిచి చూపించు అంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణకు సవాల్ విసిరారు. మండలంలోని డిండిచింతపల్లి గ్రామంలో రూ.10లక్షలతో మంజూరైన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహారీ కోసం శుక్రవారం విప్ గువ్వల భూమిపూజ చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజాయితీగా మానాయకులు ఉపాధిహామీలో కల్లాలు నిర్మిస్తుంటే అం దులో తప్పు చేశారని వంశీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉపాధి పనుల్లో 20శాతం కమీషన్ తీసుకుని మీ నాయకులకే పనులు అమ్ముకున్నావని మీ నేతలే చెబుతున్నారు. అటువంటి సంస్కృతి టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదన్నారు. నా వెంట నిజాయితీ గల నేతలు ఉన్నారని, వా రు కష్టాన్ని నమ్ముకున్నారు కానీ అవినీతికి పాల్పడలేదన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుతో మండలానికి 30వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లోకి చేరుతుంటే తట్టుకోలేని వంశీ నాపై లేనిపోని ఆరోపణలు చేయ డం దౌర్భాగ్యమన్నారు. టీఆర్ఎస్లోకి వలసల పరంపర ఆపడం ఎవరితరం కాదన్నారు. ప్రజల అండదండలతో అచ్చంపేట నియోజవర్గంలో మూడోసారి కాదు డబుల్ హ్యాట్రిక్ సాధిస్తానని ఆ యన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్ సరిత, సింగిల్విండో చైర్మన్ సురేందర్రెడ్డి, జెడ్పీ కో-ఆప్షన్ హామీద్, మార్కెట్ డైరెక్టర్ రాజేందర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు గణేశ్రావు, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లాలూయాదవ్, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్, ఎంపీడీవో పవన్కుమార్, ఏఈ మణిపాల్నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు అంజి, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్వర్రావు, సాయిలు, నాయకులు రవీందర్రెడ్డి, రాజరంగారావు, దేవా, నాగేశ్, మల్లేష్ పాల్గొన్నారు.
విప్ ఉపాధ్యాయుడైన వేళ
ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు శుక్రవారం మండలంలోని డిండిచింతపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. పాఠశాల ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ కోసం వచ్చిన విప్ ముందుగా పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు క్రమశిక్షణ చదువుతూ ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.