అలంపూర్/ ఉండవెల్లి/వడ్డేపల్లి, జూలై 20 : సినీ హీరో నందమూరి బాలకృష్ణ అలంపూర్, ఉండవెల్లి మండలాల్లో సందడి చేశారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ నిర్మాణ సంస్థ నూతనంగా నిర్మిస్తున్న బాలకృష్ణ 107వ చిత్రం షూటింగ్ను ఉండవెల్లి మండలం బూడిదపాడు శి వారులోని పంటపొలాలు, జోగుళాంబ అమ్మవారి ఆల య సముదాయాల్లో బుధవారం చిత్రీకరించారు. బాలకృ ష్ణ ట్రాక్టర్ నడుపుతున్న పాట దృశ్యాలను చిత్రీకరించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు, కర్నూల్ జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చి షూ టింగ్ వద్దకు చేరుకోవడంతో ట్రాఫిక్ సమస్య నెలకొన్నది. గతంలో కూడా సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి చిత్రాలను అలంపూర్, ఉండవెల్లి, పుల్లూరు పరిసరాల్లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కుటుంబ సభ్యులు జోగుళాంబ అమ్మవారిని ఇష్టదైవంగా ఆరాధిస్తారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించిన కృష్ణా పుష్కరాలకు బాలకృష్ణ కుటుంబ సభ్యులతో పుష్కరస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.