మహబూబ్నగర్, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :నెట్వర్క్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా;కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతున్నది. ఎడతెరిపి లేని భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాంల గేట్లెత్తడంతో జూరాల, సుంకేసుల జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. దీంతో జూరాల నుంచి 18గేట్ల ద్వారా అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. తీర ప్రాంతాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి తీర ప్రాంతాల్లో పర్యటించారు. కూలిన ఇండ్లు, వరద తదితర అంశాలపై ఆరా తీశారు.
కృష్ణ, తుంగభద్ర నదులు పోటెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాంలకు భారీగా వరద వస్తున్న ది. టీబీ డ్యాంకు వరద భారీగా వస్తుండడంతో 30 గేట్లెత్తారు. బుధవారం టీబీ డ్యాంలో 1,06,818 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1,15,174 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో.. ప్రస్తుతం 99.703 టీఎంసీ లు నిల్వ ఉన్నట్లు ఎస్ఈ శ్రీకాంత్రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. టీబీ డ్యాం నుంచి శ్రీశైలం వైపునకు వరద ఉరకలేస్తున్నది. గేట్ల ద్వారా వదిలిన వరద ఆర్డీఎస్ ఆనకట్టకు బుధవారం రాత్రి చేరుకున్నది. అక్కడి నుంచి సుంకేసుల బ్యారేజీ ద్వారా శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంది.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. బుధవారం ఆనకట్టకు 258 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 224 క్యూసెక్కులు సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు.
జూరాలలో 18 గేట్లు ఎత్తివేత..
ఆత్మకూరు/అమరచింత, జూలై 13 : జూరాల జ లాశయానికి ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఎగువ, ది గువ జలవిద్యుత్ కేంద్రాల్లో 35,061 క్యూసెక్కులతో 12 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. 18 గేట్ల ను మీటరు మేర ఎత్తి 67,094 క్యూసెకులను దిగువకు వదులుతున్నారు. ప్రాజుక్టు పూర్తి స్థాయి నీటి ని ల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.585 టీ ఎంసీలు ఉన్నది. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 1,05,198 క్యూసెక్కుల ఔట్ఫ్లో కొనసాగుతున్నది.
శ్రీశైలం జలాశయానికి..
శ్రీశైలం, జూలై 13 : శ్రీశైలం జలాశయానికి లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద వస్తున్న ది. బుధవారం జూరాల గేట్ల ద్వారా 67,428 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 38,394 క్యూసెక్కు లు.. మొత్తం 1,05,822 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుకుంటున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 46.51 టీఎంసీలు నిల్వ ఉన్నది.
కోయిల్సాగర్ ప్రాజెక్టులో..
దేవరకద్ర రూరల్, జూలై 13 : దేవరకద్ర మండలంలోని కోయిల్సాగర్లోకి జూరాల ప్రాజెక్టు నుంచి వరదను వదులుతున్నారు. బుధవారం ప్రాజెక్టులో 21.7 అడుగుల మేర నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నారాయణపేట, మద్దూర్, కొడంగల్ మండలాలకు తాగునీటి నిమిత్తం 10 క్యూసెక్కులు వదులుతున్నారు.