జడ్చర్ల/టౌన్, జూలై 12 : మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డు ల్లో మంగళవారం మున్సిపల్ అధికారులు పర్యటించి శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించారు. మున్సిపల్ కమిషనర్ మహమూద్షేక్ వార్డుల వారీగా తిరిగి పాత ఇండ్లను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లల్లో నివాసముంటున్న వారిని గుర్తించి వారికి పునరావస కేంద్రాలకు తరలించారు. మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ నవనీత కలసి ఇంటింటికీ తిరిగి పరిశీలించారు. అలాగే 23వ వార్డులో కౌన్సిలర్ ఉమాశంకర్గౌడ్తో కలసి ఆయన స్థానిక ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా ఉన్న పాత ఇండ్లను పరిశీలించారు. వర్షాలకు ఇండ్లుకూలే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా వారి ని సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పునరావస కేం ద్రానికి తరలించి అవసరమైన సదుపాయాలను కల్పించారు.
మిడ్జిల్లో..
మిడ్జిల్, జూలై 12 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ శ్రీనివాసులు సూ చించారు. మంగళవారం మండలంలోని వాడ్యాల్, బోయిన్ప ల్లి గ్రామాల్లో ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎస్సై రాంలాల్నాయక్, ఎంపీవో అనురాధ స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి శిథిలావస్థకు చేరిన ఇండ్లల్లో నివాసముంటున్న రెండు కుటుంబాలను ఖాళీ చేయించి, గ్రామపంచాయతీలో వసతి ఏర్పాటు చేశారు. అయ్యవారిపల్లిలో రేకుల ఇండ్లు నేలమట్టం అయ్యింది. కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు నారాయణరెడ్డి, మంగ మ్మ, సునీత, ఆర్ఐ రామాంజనేయులు, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసులు, మధు, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
బాలానగర్లో..
బాలానగర్, జూలై 12 : మండలంలో కురుస్తున్న ముసురు వర్షాలకు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచించారు. మంగళవారం మండలంలో చిన్నరేవల్లి, మొదంపల్లి గ్రామాల్లో ఆర్ఐ వెంకట్ రెడ్డి పర్యటించి కూలిపోయిన ఇండ్లను పరిశీలించి వారితో మాట్లాడారు. వారి ఇండ్లు పూర్తిగా దెబ్బతినడంతో సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, చంద్రమౌళి ఉన్నారు.
రాజాపూర్లో..
రాజాపూర్, జూలై 12: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ శంకర్ అన్నారు. మంగళవారం మండలంలోని మల్లెపల్లి, రాయపల్లి, తిర్మలాపూర్ గ్రామాల్లో వర్షాలకు పడిపోయిన పాత ఇండ్లను పరిశీలించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ధర్మపూర్లో..
మహబూబ్నగర్రూరల్, జూలై 12 : మహబూబ్నగర్ మండలం ధర్మపూర్ గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని పాత ఇండ్లల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలోకి తరలించారు. ప్రజలు ముసురు వర్షాల దృష్యా పాత ఇండ్లలో ఉండకూడదని ప్రజలకు సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి సూచించారు.
కోడూర్లో..
మహబూబ్నగర్రూరల్, జూలై 12 : మహబూబ్నగర్ మండలం కోడూర్ గ్రామంలో మంగళవారం సర్పంచ్ శ్రీకాంత్గౌడ్ ఆధ్వర్యంలో పాత ఇండ్లల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోడూర్లోని మైసమ్మ చెరువులోని నీటి ప్రవాహాన్ని, కట్టను రూరల్ మండల తాసిల్దార్ పాండునాయక్, ఆర్ఐ క్రాంతికుమార్గౌడ్, అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోశ్, వార్డు సభ్యులు రమేశ్గౌడ్, గ్రామ సిబ్బంది ఉన్నారు.
మహ్మదాబాద్లో..
మహ్మదాబాద్, జూలై 12 : ప్రజలు సురక్షితమైన ఇళ్లల్లోనే ఉండాలని తాసిల్దార్ ఆంజనేయులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాత ఇండ్లు కూలిపోతుండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మంగళవారం మండల కే్రంద్రంతోపాటు జూలపల్లి, దేశాయిపల్లి గ్రా మాల్లో పర్యటించారు. జూలపల్లిలో రెండు ఇండ్లు కూలినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో శంకర్నాయక్, డిప్యూటీ తాసిల్దార్ శేఖర్, ఆర్ఐ యాదయ్య, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు.
భూత్పూర్లో..
భూత్పూర్, జూలై 12 : వర్షాలు ఇంకా మూడు, నాలుగు రోజు లు తగ్గేలా లేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ కోరారు. మంగళవారం ఆ యన మున్సిపాలిటీలోని 10వ, 4వ వార్డుల్లో పర్యటించారు. పాత ఇండ్లు, మట్టి ఇండ్లల్లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భూత్పూర్ మండలం రావులపల్లిలో ఉన్న పెద్ద వాగును భూత్పూర్ సీఐ రజితారెడ్డి, ఎస్సై భాస్కర్రెడ్డి పరిశీలించారు. కప్పెట-రావులపల్లి వాగు తెగిపోవడంతో వరద భారీ గా వస్తున్నట్లు సర్పంచ్ శ్రీనివాసులు తెలిపారు. కొత్తమొల్గర గ్రామంలో సర్పంచ్ వెంకటమ్మ, తాటిపర్తి గ్రామంలో సర్పంచ్ వెంకటయ్య పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నూరుల్నజీబ్, మేనేజర్ అశోక్రెడ్డి, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, సురేశ్గౌడ్, గడ్డంరాములు, తిరుపతయ్యగౌడ్, నర్సింహులు, శ్రీశైలం ఉన్నారు.
గండీడ్లో..
గండీడ్, జూలై 12 : వర్షాలతో ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుం డా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని మండల ప్రత్యేక అధికారి దశరథ్ తెలిపారు. మంగళవారం మహ్మదాబా ద్, గండీడ్ మండలాల అధికారులకు సమావేశం ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలు తలెత్తుతాయని వాటిని అధిగమించేందుకు అధికారులు గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రూపేందర్రెడ్డి, తాసిల్దార్లు ఆంజనేయులు, జ్యోతి, ఎంపీవో శంకర్ నాయక్, ఏవో ప్రత్యూష, పంచాయతీరాజ్ ఏఈ రాబర్టు, విద్యుత్తు శాఖ ఏఈ వెంకటయ్య పాల్గొన్నారు.
దేవరకద్రలో..
దేవరకద్రరూరల్, జూలై 12 : వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దేవరకద్ర తాసిల్దార్ జ్యోతి తెలిపారు. మంగళవారం మండలంలోని గుడిబండ గ్రామంలో పర్యటించి పాత ఇండ్లలోని ప్రజల తో మాట్లాడి పలు జాగ్రత్తలు చెప్పారు.
కార్యక్రమంలో తాసిల్దార్ జ్యోతి, ఎంపీవో శ్రీనివాస్రావు, సర్పంచ్ జ్యోతి, ఎస్సై భగవంత్రెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు కొండారెడ్డి ఉన్నారు.