మహబూబ్నగర్, జూలై 10 : వర్షాలతో ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ అన్నా రు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదివారం కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాణనష్టం కలుగకుండా జాగ్ర త్త చర్యలు తీసుకోవాలన్నారు. నీటితో నిండిన చెరువు లు, వాగులతో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుం డా చూడాలన్నారు. నీటి ప్రవాహం ఉన్న వంతెనలు, రోడ్ల వద్ద రాకపోకలను నిలిపివేయాలని ఆదేశించారు. వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీ రోడ్లు, ఆర్అండ్బీ రోడ్లు ఇతర నష్టం వివరాలను సమర్పించాలని సూ చించారు. మరో రెండురోజులు అతి భారీ వర్షాలు కురి సే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వీసీలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.
పాత ఇండ్లల్లో ఉండరాదు
గండీడ్, జూలై 10 : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున పాత ఇండ్లల్లో ఎవరూ ఉండొద్దని ఎంపీడీవో రూపేందర్రెడ్డి కోరారు. మండలంలోని ప గిడ్యాల్లో పాత ఇండ్లల్లో నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలతో ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాణి, పంచాయతీ కార్యదర్శి భార్గవి పాల్గొన్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
బాలానగర్, జూలై 10 : వర్షాలతో ప్రమాదాల బారిన పడకుండా ప్రతిఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో కృష్ణారావు అన్నారు. మండలంలోని పెద్దాయపల్లిలో పర్యటించి పాడుబడిన ఇండ్లను పరిశీలించారు. వర్షా లు కురుస్తున్నందున శిథిల ఇండ్లల్లో ఎవరూ ఉండొద్దని కోరారు. అలాగే తాగునీటి పైప్లైన్ లీకేజీలకు ఎప్పటికప్పుడు మరమ్మతు చేయించాలని సర్పంచ్ శంకర్కు సూచించారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
మహ్మదాబాద్, జూలై 10 : గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీవో శంకర్నాయక్ సూచించా రు. మండలకేంద్రంలో పాత ఇండ్లను పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు. పాడుబడిన ఇండ్లల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతంలో వసతి కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పార్వతమ్మ, కార్యదర్శి రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మండలంలో..
మహబూబ్నగర్ రూరల్, జూలై 10 : మండలంలోని దివిటిపల్లిలో అర్బన్ తాసిల్దార్ పార్థసారధి, ఆర్ ఐ చైతన్యకుమార్ పర్యటించి పాత ఇండ్లను పరిశీలించారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని పాత ఇండ్లల్లో నివసిస్తున్న వారికి సురక్షిత ప్రాంతంలో వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. వర్షాలతో ఏదేని ప్రమాదం సంభవిస్తే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్రూం 08542241165, 08542252203 నెంబర్లను సం ప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ జరీనాబేగం తదితరులు పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, జూలై 10 : మండలకేంద్రంతోపాటు లోకిరేవు, కూచూర్ గ్రామాల్లో తాసిల్దార్ రాజేందర్రెడ్డి పర్యటించి పాత ఇండ్లు, చెరువులను పరిశీలించారు. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాత ఇండ్లలో ఎవరూ ఉండొద్దని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లల్లో నివసిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందజేయాలని కోరారు. అలాగే చెరువుల అలుగులు, తూములు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాసిల్దార్ వెంట సర్పంచ్ గోపాల్గౌడ్, ఆర్ఐ గోవర్ధన్ తదితరులు ఉన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, జూన్ 10 : మండలంలోని టంకరలో ఎంపీడీవో ధనుంజయగౌడ్ పర్యటించి పాత ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున పాత ఇండ్లను ఖాళీ చేసి ప్రభుత్వ భ వనాల్లో ఉండాలని సూచించారు. అలాగే పారిశుధ్యం లోపించకుండా ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై తిరుపాజీ, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.