అచ్చంపేట, జూలై 5 : అడవుల అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం తో నల్లమలలో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. అడవుల సంరక్షణకుగానూ అటవీశాఖలో ఖాళీగా ఉన్న బీట్, సెక్షన్ అధికారులను భర్తీ చేసింది. దీంతోపా టు అటవీశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న ఉ ద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు టైగర్ ట్రాకర్లను నియమించారు. అ మ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా మార్చి పర్యవేక్షణకు ప్రత్యేక ఎఫ్డీవోను నియమించింది. అటవీశా ఖ పంపించిన అనేక ప్రతిపాదనలను అంగీకరించి అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసింది. దీంతో నల్లమల అటవీ ప్రాంతం మరింత విస్తరించడంతో వన్యప్రాణులు, పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా ఎక్కడికక్కడ చెక్పోస్టులు, బేస్ క్యాంపులు పెట్టి నిఘా వ్యవస్థను పెంచారు.
చెంచులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. కొత్తవాళ్లు వెళ్లాలంటే తప్పనిసరిగ్గా అటవీశాఖ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. పశువులు, మేకలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీశైలం, మల్లెలతీర్థం, మద్దిమడుగు వంటి దైవక్షేత్రాలు ఉన్నందున యాత్రికులు, భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. గతంలో అంతగా పట్టించుకోకపోవడంతో జనసంచారం, వాహనాల రాకపోకలు ఉండడంతో వన్యప్రాణులు అడవుల్లోనే ఉం టూ బయట పెద్దగా కనిపించేవి కావు. ఈ క్రమం లో రాత్రి 9 గంటల తర్వాత వచ్చే వాహనాలను ఇ టు మన్ననూర్, అటు దోమలపెంట చెక్పోస్ట్ వద్దే ఆపుతున్నా రు. దీంతో వన్యప్రాణులు యథేచ్ఛగా రోడ్లపైకి, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి హాని జరగకుండా అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధానం గా పులులు, చిరుతలు సంచరించే ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. వేసవిలో తాగునీటి కోసం సాసర్పిట్లు ఏర్పాటు చేసి.. బయటి నుంచి ట్యాంకర్లతో నీటితో నింపుతున్నారు. రోడ్లపై చిరుతలు, జిం కలు, దుప్పులు గుంపులుగుంపులుగా కనిపిస్తున్న ట్లు చెంచులు చెబుతున్నారు.
వన్యప్రాణుల సంతానోత్పత్తికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఇటీవల కురిసిన ఆడపాదడపా వర్షాలకు అటవీ ప్రాం తం చిగురిస్తున్నది. నల్లమల ఫారెస్ట్లో 21కిపైగా పులులు ఉండగా.. అందులో 9 మగపులులు, 12 ఆడపులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు అంచ నా వేస్తున్నారు. అలాగే 150 చిరుతపులులు, 150 ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, కణుతులు, నెమళ్లు, కుం దేళ్లు, అడవికుక్కలు ఉన్నాయి. ఫరహాబాద్, పుల్లాయపల్లి, దోమలపెంట, మద్దిమడుగు, భౌరాపూర్, వ్యూ పాయింట్ ప్రాంతాల్లో పులులు, చిరుతలు సంచరిస్తున్నాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు వన్యప్రాణుల సంతానోత్పాతికి అనువైన రోజులుగా అటవీశాఖ అధికారులు భావిస్తారు. దీంతో ఈ మూడు నెలలపాటు అటవీ ప్రాంతంలోకి జంతు సందర్శకులు, పర్యాటకులను అనుమతించకుండా అధికారులు సఫారీని తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా, ఆదివారం హైదరాబాద్కు చెందిన పర్యాటకులు ఫరహాబాద్ అటవీప్రాంతంలో పర్యటిస్తుండ గా పెద్దపులి కనిపించినట్లు చెప్పారు. ఫోన్లో పెద్దపులి సంచార దృశ్యాలను బంధించారు. రెండేండ్ల కిందట నల్లమల అటవీ ప్రాంతంలోని ఫరహాబాద్లో జన్మించిన పులి.. ఇటీవల మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ మూడు పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. వాటికి పేర్లు కూడా పెట్టారు.