మహబూబ్నగర్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు పత్తి సాగు చేయాలంటే రైతులు వెనకడుగు వేసేవాళ్లు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి సాగుచేసినా గిట్టుబాటు ధర లే క నష్టాల పాలై అప్పులు భరించలేక ఆత్మహత్య చేసుకునే దైన్యస్థి తి.. మరోవైపు విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు శాపంగా మారేవి. తెలంగాణ వచ్చాక పరిస్థితి తారుమారైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో బీడు భూములకు సాగునీరు అందింది. దీంతో సాగు గణనీయంగా పెరిగింది. మరోవైపు రైతుబంధు ఇస్తుండడంతో రైతులు పత్తి సాగుకు ధైర్యంగా శ్రీకారం చుట్టారు. మార్కెటింగ్ సౌకర్యాలు కూడా మెరుగుపడడంతో ఏటేటా పత్తి సాగు పెరుగుతున్నది. ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి జిల్లా తెల్లబంగారానికి కేరాఫ్గా మారింది. 2018-19లో రూ.2వేల కోట్లకు పైగా విలువైన పత్తిని సీసీఐ కొ నుగోలు చేసింది. 2019-20లో 67.20 లక్షల క్వింటాళ్ల పత్తి పండడంతో రూ.4వేల కోట్ల రాబడి వచ్చింది. కాగా, క్వింటా పత్తి కి రూ.6,025 మద్దతు ధర ఉండగా.. బహిరంగ మార్కెట్లో గ తేడాది రూ.7వేల నుంచి రూ.12 వేల వరకు పలికింది. దీంతో రైతులు సీసీఐకి కాకుండా ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇతర పంటలపై అవగాహన కల్పించడంతో గతేడాది కంటే ఈసారి 15 శాతం ఎక్కువగా పత్తి సాగు పెరిగినట్లు అంచనా. నకిలీ విత్తనాలపై కొరఢా ఝుళిపించడం, నాసిరకం విత్తనాలు అమ్మే వారిపై కేసులు నమోదు చేయడంతో సాగు పెరుగుతున్నది. మరోవైపు ప్రైవేట్ వ్యాపారులే విత్తనాలు సరఫరా చేసి.. పండిన పత్తిని రైతుల వద్దే కొనుగోళ్లు చేస్తామని అగ్రిమెంట్లు చేసుకోవడంతో ఈసారి సాగు రెట్టింపైం దని అధికారులు చెబుతున్నారు.
ఇతర పంటగా పత్తి..
ఉమ్మడి జిల్లాలో కమర్షియల్ పంటలపై రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రాజెక్టుల కింద దాదాపు 8 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. అయితే, వరికి ప్రత్యామ్నాయంగా కమర్షియల్ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం కోరడంతో.. గ తేడాది నుంచి అధికంగా పత్తిని సాగు చేస్తున్నారు. పత్తి సాగు చే యాలని వ్యవసాయ అధికారులు ప్రత్యేకంగా బ్రోచర్లు, బుక్లెట్ల తో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా రైతులకు సూచనలిస్తున్నారు. దీంతో లక్ష్యానికి మించి పత్తి సాగు అవుతుందని అధికారుల అంచనా. మహబూబ్నగర్ జిల్లాలో గతేడాది 76 వేల ఎకరాలుంటే.. ఈసారి 72,857 ఎకరాలకు చేరుతుంద ని భావిస్తున్నారు. అలాగే జోగుళాంబ గద్వాలలో 2021లో 1,90,485 ఎకరాలు పత్తి సాగు చేయగా.. ఈసారి ఇప్పటికే 87,635 ఎకరాల్ల్లో సాగు చేశారు. వనపర్తిలో 15 వేల నుంచి 20 వేల ఎకరాలకు పెరుగుతుందని అంచనా. నారాయణపేటలో గతేడాది 1.65 లక్షలుండగా.. రెండు లక్షల ఎకరాలకు చేరుతుందని భావిస్తున్నారు. ఈ ఒక్క జిల్లాలోనే 25 శాతం పెరగనున్నది. నాగర్కర్నూల్లో గతేడాది 3,52,746 ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. ఈసారి 4,40,393 ఎకరాలకు చేరుతుందని అంచనా.
నకిలీ విత్తనాలపై కొరఢా..
ఈ సారి కల్తీ విత్తనాలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు, పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి కేసులు నమోదు చేయడంతో నకిలీ బెడద తప్పింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో అనేక మంది వ్యాపారులు, దళారులపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించడంతో నకిలీ విత్తనాలు విక్రయించేందుకు భయపడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, భూ త్పూర్లో కూడా అరికట్టగలిగారు. పక్క జిల్లాల నుంచి నకిలీ విత్తనాలు జిల్లాలో ప్రవేశించకుండా నిఘా పెట్టడంతో వ్యాపారులు కంపెనీ విత్తనాలనే రైతులకు సరఫరా చేశారు. వ్యవసాయ అధికారులు విత్తన దుకాణలను తనిఖీలు చేస్తుండడం, పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో నకిలీ దందాకు తెర పడింది.
ఏటేటా పెరుగుతున్న టర్నోవర్..
ఉమ్మడి జిల్లాలో 2015 నుంచి పత్తి అమ్మకాలు జోరందుకున్నాయి. గతంలో జడ్చర్ల, గద్వాలలో మాత్రమే ఉన్న మార్కెట్లకు వేల క్వింటాళ్ల పత్తి పోటెత్తుతుండడంతో కొనుగోళ్లు చేయలేక వ్యాపారులు చేతులెత్తేసేవారు. దీంతో దళారులు రంగ ప్రవేశం చేసి తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడికక్కడ మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోళ్లకు ప్రోత్సహించడంతో పత్తి వ్యాపారం ఊపందుకున్నది. దీంతో 2015-16లో రూ.1200 కోట్లు, 2018-19లో రూ.2వేలకు కోట్లు, 2019-20లో రూ.4వేల కోట్లకు పెరిగింది. గతేడాది పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.6,025 ఉండగా.. బహిరంగ మార్కెట్లో రూ.12,800 వరకు ఉండడంతో దాదాపు రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల టర్నోవర్కు చేరుకుందని ఎఫ్సీఐ అధికారులు చెబుతున్నారు.