నాగర్కర్నూల్, జూలై 5 : భూగర్భజలాలను పెంపొందించుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనురాధ చగ్తి సూచించారు. జలశక్తి అభియాన్ అమలు, అభివృద్ధిని పర్యవేక్షించడంలో భాగంగా ఆమె మంగళవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించారు. కలెక్టర్ ఉదయ్కుమార్ ఆమె కు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, గ్రామీణాభివృద్ధి, భూగర్భ జలాలు, ఇరిగేషన్, వ్యవసాయ అనుబంధ శాఖలతో జలశక్తి అభియాన్ అమలు తీరుతెన్నులను ప్రొజెక్టర్ ద్వారా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లో నాగర్కర్నూల్ సైతం ఉందని, ఆరేడు ఏండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, భూగర్భజలాల పెంపునకు జాతీ య గ్రామీణ ఉపాధిహామీ ద్వారా చేపట్టిన వాటర్షెడ్, ఇంకుడు గుం తలు, హరితహారం వంటి కార్యక్రమాలతో నీటి ఎద్దడి కనిపించడంలేదన్నారు. అయితే, జిల్లాలో భూగర్భజలాలను అధికంగా వాడుకుంటున్న ఊరుకొండ, వెల్దండ, ఉప్పునుంతల వంటి మండలాలపై ప్రత్యే క దృష్టి సారించాలన్నారు.
ఈ మం డలాల్లో భూగర్భజలాల వాడకం 129 శాతం ఉండడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఊ రుకొండ, వెల్దండ వంటి మండలాల్లో వ్యవసాయ, పారిశ్రామిక అ వసరాలకు బోరుబావులు వేయడం నిషేధించామని గ్రౌండ్ వాటర్ అధికారిణి వివరించారు. ఆయా మండలాల్లో వాటర్షెడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఉపాధి హామీ ద్వారా కొన్ని ప్రత్యేక పనులు చేపట్టామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో నీటి పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని సంయుక్త కార్యదర్శి సూచించారు. రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించి జలశక్తి అభియాన్ అమలును పరిశీలిస్తామన్నారు. కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ ఎంజీకేఎల్ఐ పూర్తయ్యాక జిల్లాలో 4.34 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చిందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మనూచౌదరి, ఎఫ్డీవో రోహిత్, హైదరాబాద్ నుంచి కార్యనిర్వాహక ఇంజినీర్ సీడబ్ల్యూసీడీఎస్ ప్రసాద్, డీఆర్డీవో నర్సింగ్రావు, అధికారులు పాల్గొన్నారు.