ఉండవెల్లి, జూలై 5 : ఏసీబీ అధికారులకు డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఓ సీనియర్ అసిస్టెంట్ చిక్కిన సంఘటన మంగళవారం చోటు చేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ కథనం మేరకు.. ఉండవెల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు శ్రీరాములు(2.34ఎకరాలు), ఎల్లస్వామి(2.22ఎకరాలు) చిన్న ఆముదాలపాడు గ్రామ శివారులోని సర్వే నంబర్ 63/ఏ2లో కొత్తపేట మణిక్యమ్మ వద్ద జూలై 2020లో కొనుగోలు చేసి అలంపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
కొన్ని రోజుల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ధరణి సైట్ను అమలు చేయడంతో భూమి పట్టా మార్పిడి జరగలేదు. కొంతకాలం నిరీక్షణ అనంతరం పెండింగ్ మ్యుటేషన్లకు ధరణి సైట్లో ఆప్షన్ రావడంతో కలెక్టర్ లాగిన్కు 2021 అక్టోబర్ 14న అన్నదమ్ములు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోగా అన్న ఎల్లస్వామికి చెందిన భూమి 2022 జూన్ 10న పాస్బుక్ వచ్చింది. శ్రీరాములు కొనుగోలు చేసిన భూమి భూదాన్లో ఉన్నట్లు ఆన్లైన్లో చూపించడంతో తాసిల్దార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ సాయిబాబాను కలిసి సమస్యను పరిష్కరించాలని 2022 జూన్ 19న కోరాడు. శ్రీరాములు సమస్య ను పరిష్కరించేందుకు రూ.10 వేలు ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా డి మాండ్ చేయగా అంతమొత్తం ఇవ్వలేనని రూ.7500 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం జూన్ 25న ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశా డు. ఏసీబీ అధికారుల సలహా మేరకు మంగళవారం ఉండవెల్లి తాసిల్దార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ సాయిబాబాకు రూ.7500 ఇస్తుండగా రెండ్హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అలాగే కర్నూలు జిల్లాలోని సంతోష్నగర్లో సాయిబాబా నివాసం ఉంటున్న ఇంట్లో హైదరాబాద్ ఏసీబీ ఇన్సెక్టర్ రమేశ్, మెదక్ ఇన్సెక్టర్ రమేశ్ సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు లింగస్వామి, నల్లగొండ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.