నవాబ్పేట, జూలై 5 : ప్రేమ పేరుతో నమ్మించి పెండ్లి చేసుకొన్న ఓ ప్రబుద్దుడు ఐ దు రోజులకే భార్యకు మొఖం చాటేసి వెళ్లిపోయిన ఘటన నవాబ్పేట మండలం దేప ల్లి గ్రామంలో వెలుగుచూసింది. బాధితురా లి కథనం ప్రకారం.. నవాబ్పేట మండలం దేపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణగౌడ్, అదే గ్రామానికి చెందిన రేణుక కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరికి జూన్17న హైదరాబాద్లోని ఆర్యసమాజ్లో వివాహం జరిగింది.
ఈ క్రమంలో పెండ్లి చేసుకున్న ఐదు రోజుల తర్వాత సత్యనారాయణగౌడ్ తన తండ్రి ఆరోగ్యం బాగలేదని, తండ్రి వద్దకు వెళ్లొస్తానని భార్యతో చెప్పి వెళ్లిపోయాడు. భర్త తండ్రి వద్దకు వెళ్లి తిరిగిరాకపోవటంతో అనుమానం వచ్చి పలుమార్లు అతనికి ఫోన్లు చేసినా స్పందన లేకపోవడంతో బాధితురాలు రెండు రోజుల కిందట నవాబ్పేట పోలీసుస్టేషన్లో ఫిర్యా దు చేసింది. అయినా పోలీసుల నుంచి ఎలాంటి న్యాయం జరగకపోవటంతో బాధితురాలు ఏకంగా ఎస్పీని ఆశ్రయించింది. ఆ తర్వాత భర్త నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాధితురాలు మంగళవారం దేపల్లి గ్రామంలోని భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించింది. తన భర్త మోసం చేశాడని, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నది.