మహబూబ్నగర్టౌన్, జూలై 5: ఆయా ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. వారాంతపు సమీక్షలో భాగంగా మంగళవారం ఆయన రైల్వే ప్రాజెక్టులు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కోయిల్సాగర్, జాతీయ రహదారులు, ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సీతారామరావు, స్పెషల్ కలెక్టర్ పద్శశ్రీ, ఆర్డీవో అనిల్కుమార్, ఇరిగేషన్ ఇంజినీర్లు, రైల్వే, జాతీయరహదారి సంస్థ ఇంజినీర్లు, తాసిల్దార్లు లక్ష్మీనారాయణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
మన ఊరు-మనబడి పనులు పూర్తిచేయాలి
మనఊరు- మనబడి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పిల్లలమర్రి రహదారిలోని వెంకటేశ్వరకాలనీ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పనులను పరిశీలించారు. పాఠశాలలోని టాయిలెట్ల నిర్మా ణం, నీటిసంపు నిర్మాణం వివరాలను డీఈవోను, హెచ్ఎంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ నాలుగో తరగతిలో విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్, ఎంఈ సుబ్రహ్మణ్య, అర్బన్ ఎంఈవో జయశ్రీ, పాఠశాల హెచ్ఎం పాల్గొన్నారు.
ఐసీడీఎస్, పౌరసరఫరా అధికారులతో సమీక్ష
పౌర సరఫరా, ఐసీడీఎస్ అధికారులతో మంగళవారం కలెక్టర్ వెంకట్రావు సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరా శాఖ ద్యారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యాన్ని నేరుగా అంగన్వాడీ కేంద్రాల వద్దకు డెలివరీ చేయాలన్నారు. జిల్లాలో 1,185కేంద్రాలకు ప్రతి నెలా 803క్వింటాళ్ల బియ్యాన్ని ఇవ్వనుండగా ఇకపై అంగన్వాడీ కేంద్రాల చెంతనే ఇవ్వాలని ఆదేశించారు. ముందుగా క్లస్టర్ పాయింట్ నుంచి నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు బియ్యాన్ని సరఫరా చేయాలని చెప్పారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా సంక్షేమాధికారి జరీనా, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ జగదీశ్, డీఎస్వో వనజాత తదితరులు పాల్గొన్నారు.
రెండున్నర కోట్ల విత్తన బంతులు లక్ష్యం
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 5: ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విత్తనబంతుల ద్వారా పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషిచేస్తున్న జిల్లా మహిళా సంఘాల సభ్యుల కృషి ప్రశంసనీయమని కలెక్టర్ ఎస్ వెంకట్రావు పేర్కొన్నారు. గతేడాది జిల్లాలో రెండు కోట్ల విత్తనబంతులు తయారుచేసి గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన మహిళా సంఘాలు ఈ సంవత్సరం రెండున్నర కోట్ల విత్తనబంతులు తయారు చేసి లక్ష్యాన్ని అధిగమించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అర్బన్ పార్కులో మంగళవారం మహిళా సమాఖ్య గ్రామీణాభివృద్ధి, అటవీ, విద్య, మహిళా శిశుసంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రెండున్నర కోట్ల విత్తనబంతుల తయారీపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులు చేస్తున్న కృషి మరువలేనిదని, ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో విత్తన బంతులను తయారు చేసి గుట్టలు, కొండలు, ప్రభుత్వ భూముల్లో వెదజల్లాలని చెప్పారు. ఇందుకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. విత్తన బంతుల తయారీలో విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా మొక్కల లాభాలు, ఉపయోగాలు, చిన్నప్పటినుంచే వారికి తెలుస్తాయన్నారు. గ్రామస్థాయిలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు టీచర్లు, ఆంగన్వాడీ, గ్రామ సమాఖ్యలను పిలిచి పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో యాదయ్య, డీఎఫ్వో గంగారెడ్డి, అడిషనల్ పీడీ శారద, డీడబ్ల్యూవో జరీనా, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సురేఖ, హైదరాబాద్కు చెందిన ధాత్రి ఆర్ఎన్జీవో ఆర్గనైజేషన్ నుంచి వెంకట్, మనోజ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.