మిడ్జిల్, జూలై 4 : మతాల మధ్య చిచ్చుపెట్టడం, రైతులను మోసం చేయడం, దేశసంపదను అమ్ముకోవడంలో బీజేపీ ప్రభుత్వం నెం బర్వన్గా ఉందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శించారు. ఏ పార్టీ అయినా.. ఇంటికో ఉద్యోగం ఇ స్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని ఎ మ్యెల్యే లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలే ఆ పార్టీ అధిష్టాన ప్రకటనలను తప్పుపడుతున్నారన్నారు. సోమవారం మండంలోని బోయిన్పల్లి గ్రా మంలో రూ.46 లక్షలతో నిర్మించిన పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లో తెలంగాణ లో అమలవుతున్న ఒక్క ప థకమైనా ఉందా అని ప్ర శ్నించారు. జన్ధన్ ఖాతా లో జమ చేస్తామన్న రూ.15 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగా లు ఏమయ్యాయన్నారు. నీ ళ్లు, నిధులు, అభివృద్ధిలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. విజయ్ డెయిరీ సొ సైటీ ద్వారా సొంతంగా భవనం నిర్మించుకోవడంతో వారిని అభినందించారు. అంతకుముందు వాడ్యాల్ గ్రామానికి చెందిన కాశీంకు గిఫ్ట్ ఏ స్మైల్, సీఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా సమకూర్చిన స్కూటీని అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, జెడ్పీటీసీ శశిరేఖ, ఎంపీపీ కాంత మ్మ, సర్పంచ్ నారాయణరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ప్ర భాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, పీఏసీసీఏస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, వైస్ ఎంపీపీ తిరుపతమ్మ, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు జంగిరె డ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, నాయకులు రవీందర్రెడ్డి, సుధాబాల్రెడ్డి, రఫీ, బాలు, సుదర్శన్, మంగమ్మ, ఎల్లయ్యయాదవ్, ప్రతాప్రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాసులు, బాలయ్య పాల్గొన్నారు.
విద్య, వైద్య రంగానికి పెద్దపీట..
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నదని.., సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలకేంద్రంలో రూ.2.70 కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాలను ప్రారంభించా రు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పది ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, ఉ పాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ మన ఊరు-మన బడి కార్యక్ర మం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడి యం ఏర్పాటు చేస్తే.. మన దరిద్రపు ప్రతిపక్ష నాయకు లు వద్దంటున్నారని విమర్శించారు. కేంద్రం రాష్ర్టానికి రావాల్సిన నిధుల కంటే అదనంగా ఒక్క రూపాయి కూ డా ఇవ్వలేదన్నారు. శక్తిమంతుడైన నాయకుడితోనే దే శం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం రూ. 5.25 లక్షల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాఘువీరారెడ్డి, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్నాయక్, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహు లు, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో ల క్ష్మీదేవి, ఎంఈవో వెంకటయ్య, ప్రిన్సిపాల్ పావని ఉన్నారు.