ఊట్కూర్, జూలై 4 : విద్యార్థులు క్రమ శిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని స ర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, ఎంఈవో వెంకటయ్య అన్నారు. మండలకేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడు రామకృష్ణ ఆయన తల్లిదండ్రులు వెం కట్రాములు, జయశ్రీ సహకారంతో తపస్ నాయకులు సో మవారం పలకలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్, ఎంఈవో పాల్గొని మాట్లాడుతూ వి ద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రభుత్వం, దాతల సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు.. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేర్కృష్ణారెడ్డి, నర్సింహ, మండల అధక్ష, కార్యదర్శులు రవికుమార్, కృష్ణ, నర్సింగప్ప, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
నోటుపుస్తకాలు పంపిణీ
కోస్గి, జూలై 4 : మండలంలోని అంమ్లికుంట గ్రామాని కి చెందిన యువకుడు విద్యార్థులకు నోటుపుస్తకాలు, పెన్ను లు, పెన్సిల్లు పంపిణీ చేశారు. సోమవారం గ్రామానికి చెంది న దాత ఇంద్రకుమార్ గుండుమాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిలు అందజేశారు. ఏడు ఏండ్లుగా ఆయన పంపిణీ చేస్తున్నాడు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్రాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆదర్శనీయంగా ఉండాలి
మాగనూర్, జూలై 4 : యువత ఆ దర్శనీయంగా ఉండాలని పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని టీఆర్ఎస్ నాయకులు పీ ఏసీసీఎస్ చైర్మన్ కుమారుడు శ్రీకాంత్రెడ్డి జన్మదినం సందర్భంగా కొత్తపల్లి పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలు, పెన్సిలు, మైక్సెట్ అందజేశారు. అనంతరం వి ద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేసి అభివృద్ధిలో ముందుండాలని యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమం లో నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
టై, బెల్టులు అందజేత
నారాయణపేట రూరల్, జూలై 4 : మండలంలోని బో యిన్పల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సోమవా రం సాయిసూర్య ఫ్రెండ్స్ సేవ సమితి ఆధ్వర్యంలో టై, బెల్టులు పంపిణీ చేశారు. బాలరాజు కుమారుడి జన్మదినం సందర్భంగా టై, బెల్టులతోపాటు కర్సివ్ రైటింగ్ పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం బందయ్య, సేవ సమితి అధ్యక్షుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.