మక్తల్ రూరల్, జూలై 4 : పేదలకు నిత్యావసర సరకులను మరింత పారదర్శకంగా, సకాలంలో పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు చౌకధర దుకాణాలకు కొత్త టెక్నాలజీతో తయారు చేసిన ఈ పాస్ మిషన్లను కేటాయించింది. ఈనెల 5 నుంచి వినియోగదారులకు ఒక్కొక్కరికీ 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయడానికి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏ ర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 298 చౌకధర దు కాణాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో రేషన్ దుకాణాల డీలర్లకు కొత్త ఈ పాస్ మిషన్లపై జిల్లాకేంద్రంలో శిక్షణ తరగుతులు నిర్వహించి అవగాహన కల్పించారు. కొత్త ఈ పా స్ యంత్రాలతో సరకులను వినియోగదారులకు మరింత వేగవంతంగా పంపిణీ చేయడానికి దోహదపడుతాయని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శివప్రసాద్రెడ్డి సోమవారం “నమస్తే తెలంగాణ”కు తెలిపారు.
దీంతో గ్రామా ల్లో చౌకధర దుకాణాల్లో సర్వర్ సమస్యతో వినియోగదారులు నిత్యావసర సరకుల కోసం గంటల తరబడి షాపుల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. డీలర్లు సరకుల పంపిణీ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి పాత మిషన్లలో వేలిముద్రలు పడకపోవడం తో లబ్ధిదారులకు సరకుల పంపిణీలో రోజూల తరబడి జా ప్యమయ్యేది. ఒక్కొక్కసారి సర్వర్ సిగ్నల్ కోసం మిషన్లను తీసుకొని డీలర్లు మిద్దెల మీదకు ఎక్కి సరుకుల పంపిణీ కో సం నానాతంటాలు పడేవారు. ప్రస్తుతం కొత్త ఈ పాస్ యంత్రాలకు 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో లబ్ధిదారులకు సకాలంలో సరకులను అందించడానికి తోడ్పుడుతుందని అధికారులు అంటున్నారు. తద్వారా సర్వర్ సమస్యలు తొలగిపోనున్నాయి. ఇంకా ఎవరికైనా కొత్త ఈ పాస్ యంత్రాలు అందకపోతే మక్తల్, నారాయణపేట స్టాక్ పాయింట్ గోదాముల వద్ద తీసుకోవాలని సివి ల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ డీటీ గురాజారావు తెలిపారు.
ఒక్కొక్కరికీ పది కిలోలు
తెల్లరేషన్ కార్డు వినియోగదారులకు ఈనెలలో ఒక్కొ లబ్ధిదారునికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నాం. ఈనెలలో కూడా ప్రభుత్వం అందిస్తున్న రూపాయి కిలో బియ్యానికి బదులుగా ఉచితంగా 5 కిలోలు, పీఎం కల్యాణ యోజన పథకం నుంచి మరో 5 కిలోలు మొత్తం ఒక యూనిట్కు 10 కిలోల చొప్పున ఉ చితంగా సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లావ్యాప్తంగా 298 చౌకధర దుకాణాలకు రెగ్యులర్ కోటాతోపాటు అదనంగా 2590 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించడం జరిగింది.
– శివప్రసాద్రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి