భూత్పూర్, జూలై 1 : పరిసరాల శుభ్రతతోనే వ్యాధులను అరికట్టవచ్చని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ అన్నారు. శుక్రవారం డ్రైడే సందర్భంగా మున్సిపాలిటీలోని 10వ వార్డులో పర్యటించి పరిసరాల ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి నిల్వనీటిని పారబోశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రధానంగా వ్యాధులకు కారణమయ్యే దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా ఇంటి పరిసరాల్లో నీటినిల్వలు లేకుండా చూడాలన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరుల్నజీబ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలి
ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని ఎంపీడీవో కృష్ణారావు అన్నారు. మండలంలోని పెద్దాయపల్లిలో పర్యటించి సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే ఇంటింటికెళ్లి నీటినిల్వలను తొలగించారు. వానకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కుమ్మరి రాజు, పంచాయతీ కార్యదర్శి అనిల్కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, జూలై 1 : మండలంలోని కొత్తతండాలో ఎంపీవో జగదీశ్ పర్యటించి పరిసరాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీటినిల్వలు లేకుండా జా గ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమం లో హరిశ్చందర్నాయక్, కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, జూలై 1 : మండలంలోని పగిడ్యాల్లో ఎంపీవో శంకర్నాయక్ పర్యటిం చి పరిసరాల శుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామంలో పారిశుధ్యం లోపించకుండా ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. నీటితొట్టె, సంపుల్లో ప్రతి శుక్రవారం నీటిని తొ లగించి శుభ్రం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
పారిశుధ్యం లోపించొద్దు
మహబూబ్నగర్టౌన్, జూలై 1 : మున్సిపాలిటీలోని వార్డుల్లో పారిశుధ్యం లోపించకుండా చూడాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. 11వ వార్డు బాలాజీనగర్లో శుక్రవారం పారిశుధ్య పనులను పరిశీలించారు. ఇండ్ల మధ్య నిలిచిన మురుగును వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. ఖాళీ స్థలాలకు ము రుగును వదులుతున్న ఇండ్ల యజమానులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ పాల్గొన్నారు.