మరికల్, జూలై 1 : తెలంగాణ ప్రభుత్వం రైతు కుటుంబాలకు భరోసా కల్పించడానికి రైతుబీమా పథకం ప్రవేశ పెట్టిందని నారాయణ పేట టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ఆన్నారు. శుక్రవారం మండలంలోని రాకొండ గ్రామంలో రైతు కుటంబాలకు రైతుబీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్నల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తోపాటు, గత మూడురోజులుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం డబ్బులు వేయడం జరుగుతుందన్నారు. రాకొండ గ్రామం లో వివిధ కారణాలతో ముగ్గురు రైతులు మృతి చెందగా ఒక్కో కుటంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేసినట్లు తెలిపారు.
కోయిల్ సాగర్ నీటిని విడుదల చేయాలి
యాసంగి పంటలకు నీరు వదలకపోవడంతో రైతులు కొంత ఇ బ్బందులు పడ్డారని, వానకాలంలో సకాలంలో రైతులకు కోయిల్సాగర్ నీటిని విడుదల చేయాలని రాకొండ, పూసల్పాడ్ రైతులు ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డికి వివరించారు. రైతుల అవసరం మేరకు రైతులకు కోయిల్సాగర్ నీటిని ఆందిస్తామని, రైతులు ధైర్యంగా ఉండాలని రైతులకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఉపసర్పంచ్ రాజేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ సంపత్కుమార్, తీలేరు సింగిల్విండో ఆధ్యక్షుడు రాజేందర్గౌడ్, వైస్చైర్మన్ సత్యానారాయణరెడ్డి, మరికల్ సర్పంచ్ కస్పే గోవర్ధన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతయ్య, బీసీ విభాగం మండల అధ్యక్షుడు గాదం మల్లేశ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు రాజేశ్, నాయకులు రాజవర్ధన్రెడ్డి, బసంత్, జగదీశ్, కృష్ణయ్య, కృష్ణారెడ్డి, రామస్వామి, ఎల్.రాములు, వైన్స్ నరహరి, ఆంజనేయులు, కనుగంటి నారాయణ, అశోక్కుమార్, నర్సింహులు,ముకుంద్రెడ్డి, రాయుడు, విష్ణువర్ధన్రెడ్డి, సురేందర్, సుధాకర్గౌడ్, మండల వ్యవసాయశాఖ ఆధికారి శివకుమార్తో పాటు పలువురు మాజీసర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన మానసకు రూ.60వేలు, మసోది హఫీజా బేగంకు రూ.60వేలు, వెంకటేశ్కు రూ.48వేలు, ఫైజుద్దీన్కు రూ.26వేలు, ఐజాక్మెహవిష్కు రూ.24,500 మంజూరుకాగా చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
దళితుల అభ్యున్నతే ధ్యేయం
దళితుల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎ మ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో దళితబంధు పథకం ద్వారా మంజూరైన వాహనాలను లబ్ధ్దిదారులకు పంపిణీ చేశారు. దామరగిద్ద మండలం లోని లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిమ్మప్పకు మంజూరైన ట్రాక్టర్ను, నారాయణపేట మండలం బైరంకొండ గ్రామానికి చెందిన రవికుమార్కు మంజూరైన కారును అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ జగదీశ్, పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, కౌన్సిలర్ తఖీచాంద్ తదితరులు పాల్గొన్నారు.