నారాయణపేట రూరల్, జూన్ 30: పదో తరగతి ఫలితాలు గురువారం వెలుబడ్డాయి. పేట జిల్లాలో 3802 మంది బాలురు, 4158 మంది బాలికలు పరీక్షలు రాశా రు. ఇందులో 3,245 మంది బాలురు, 3,810 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. 88.63 ఉత్తీర్ణతాశాతం నమోదైంది. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో మెరుగైన ఉత్తీర్ణత శాతం నమోదైంది. జిల్లాలో 6 గురుకుల పాఠశాలల్లో 475 మంది విద్యార్థులకుగానూ 468మంది ఉత్తీర్ణత సాధించా రు.
జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 79 మంది విద్యార్థులకుగానూ 79మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మౌనిక, సీత, వినీల 10/10 జీపీఏ సాధించారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ దేవసేన, ఉపాధ్యాయులు విద్యా అభినందించారు. అలాగే మైనారిటీ గురుకుల పాఠశాలలో 58 మంది విద్యార్థులకుగానూ 54మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 9.8 జీపీఏతో అల్లాఉద్దీన్ పాఠశా ల టాపర్గా నిలిచారు. వీరిని ప్రిన్సిపాల్ ఫరీద్ అభినందించారు. జాజాపూర్ ఉన్నత పాఠశాలలో 89మంది విద్యార్థులకుగానూ 79మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో సునీత 9.2 జీపీఏ సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది. వివిధ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు విద్యార్థులను అభినందించారు.
మెరిసిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
కోస్గి, జూన్ 30: పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. గురువారం విడుదలైన ఫలితాలలో కోస్గి పట్టణంలోని బాలుర ఉన్నతపాఠశాలకు చెందిన మధురారెడ్డి 9.8ల ఆసిఫా9.7 ఆదర్శ పాఠశాలకు చెందిన త్రివేణి9.7 గ్రేడ్లు సాధించి టాపర్లుగా నిలిచారు. గుండుమాల్ ఆదర్శ పాఠశాలలో 98శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.