మహబూబ్నగర్, జూన్ 30: రైతుబంధు డబ్బులను బ్యాంక్ అధికారులు పాత బాకీలకు జమ చేసుకోకూడదని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మోన్నప్పగుట్ట వద్ద ఉన్న ఎస్బీఐని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. గురువారం రెండున్నర ఎకరాల భూమి ఉన్న రైతులకు డబ్బులు జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంక్ అధికారులు అవసరమైన సదుపాయాలను కల్పించాలని సూచించారు. రైతుబంధు డబ్బులు మీ ఖాతాలో జమయ్యాయా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు.
కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కుర్మయ్య అనే రైతు తనకు సెల్ఫోన్ మెసేజ్ వచ్చిందని తన ఖాతాలో రూ.12వేలు మయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. రైతులు మీ సేవ కేంద్రాల్లోనూ డబ్బులు రూ. 30వేల వరకు డ్రా చేసుకునేందుకు అవకాశం ఉందని, మీ ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు. రైతులు బ్యాంకులకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఇంటి దగ్గరే డబ్బులు తీసుకునేందుకు సౌకర్యాలను ఉపయోగించుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో బ్యాంక్ రీజినల్ మేనేజర్ శ్రావణ్కుమార్, డిప్యూటీ మేనేజర్ శివ, చీఫ్ మేనేజర్ సమీర్, తదితరులు ఉన్నారు.
పశు సంపదను పెంపొందించుకోవాలి
దేవరకద్ర రూరల్, జూన్ 30: ప్రతి గ్రామంలో పశువుల యజమానులు తమ పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి పశుసంపదను పెంపొందించుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం మండలంలోని బస్వాయిపల్లి గ్రా మంలో దేవరకద్ర పశువైద్యశాల సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించా రు. రైతులు, పశు యజమానులతో మాట్లాడి మందులు పంపిణీ చేశారు. పశువులు అధికంగా ఉన్న గ్రామాల్లో ఇలాంటి వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే పాడి ఉత్పత్తిని కూడా పెంచేందుకు పశుపోషకులు కృషి చేయాలన్నారు. గ్రామంలో వెటర్నరీ కేంద్రాన్ని ఏర్పా టు చేసేందుకు ఆ శాఖ అదికారులకు నివేదిక పంపుతామన్నారు.
ఆరోగ్య ఉపకేంద్రాన్ని అప్గ్రేడ్ చేస్తామని, పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చుతామన్నారు. గ్రామాభివృద్ది కోసం సర్పంచ్ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం హజిలాపూర్ గ్రామంలో మన ఊరు మనబడిలో మంజూరైన పాఠశాల అభివృద్ధ్ది, నిర్మాణ పనులను పరిశీలించారు. చౌదర్పల్లి గ్రామశివారులో ఉపాధి పనులు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, తాసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసులు, సర్పంచ్ సుజాత, పశువైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్గౌడ్, వై ద్యులు జీషాన్అలీ, వెంకటేశ్వర్లు, నరేందర్యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, రైతుబంధు మండ ల అధ్యక్షుడు కొండారెడ్డి, పీఏసీసీఎస్ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఖదీర్పాషా, మార్కెట్ చైర్పర్సన్ కొండ సుగుణాశ్రీనివాస్రెడ్డి, సర్పంచులు బుచ్చారెడ్డి, యుగంధర్రెడ్డి, నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు.