కోస్గి, జూన్ 30: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే హరితహారం కార్యక్రమం యుద్ధ్దప్రాతిపదికన సాగాలని, కాలనీలన్నీ పచ్చదనాన్ని సంతరించుకునేలా కార్యక్రమం చేపట్టాలని కౌన్సిల్ సమావేశంలో స భ్యులు తీర్మానించారు. గురువారం చైర్పర్సన్ శిరీష అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై తీర్మానం చేశారు. చెత్త సేకరణకు సంబంధించి ఆటోలు, ట్రాక్టర్లు సరిపోవడంలేదని కొత్తగా నాలుగు ఆటోలు, రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు తీర్మానించారు. అదేవిధంగా వార్డుల్లో తాగునీటి సమస్య లేకుండా మిషన్ భగీరథద్వారా కాలనీలలో ఎక్కడ నీటిసమస్య లేకుండా చేయాలని ఎక్కడైన చిన్నచిన్న పనులు ఉంటే పూర్తిచేయించాలన్నారు.
కాలనీల్లో పరిశుభ్రత పాటించాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సిబ్బందితో కాలనీలను నిత్యం బ్లీచింగ్చేయించాలన్నారు. కొత్త మున్సిపల్చట్టం ప్రకారం సిబ్బంది వేతనాలు ఈనెలనుంచి అందించాలన్నా రు. ముఖ్యంగా హరితహరం కార్యక్రమంలో భాగంగా రేపటినుంచి మొక్కలు నాటేందుకు గుంత లు తీయించాలని తరువాత మొక్కలు నాటాలని ప్రతి వార్డులో కేటాయించినన్ని మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ పూర్ణచందర్, కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యు లు ఉన్నారు.