మహబూబ్నగర్ టౌన్, జూన్ 28 : ఇంటర్ ఫలితా ల్లో వాగ్దేవి కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించా రు. కళాశాల ఏర్పడిన అనతికాలంలోనే విద్యార్థులు రా ష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. ఎంపీసీలో అం కిత్ 467 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించారు. బైపీసీలో భాగ్యలక్ష్మి, అనుష్క 436 మా ర్కులతో రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. సీనియర్ ఎంపీసీలో విద్యార్థులు 987, 986, 985, బైపీసీలో 985, 984, 972 మార్కులను సాధించారు. ఉత్త మ మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజే సి శాలువాతో సన్మానించారు. స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. విద్యార్థులతో కలిసి పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదల, స్వయంకృషి ఉంటే నిర్ధేశిత ల క్ష్యాన్ని చేరుకుంటారన్నారు. కళాశాల ఏర్పాటై 7వ వ సంతంలోకి అడుగుపెట్టిందన్నారు. పట్టుదలతో చదువుకోవాలనే తపన ఉంటే అందరూ ర్యాంకర్లుగా నిలుస్తారన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గీతాదేవి, యాజమాన్య సభ్యులు కోట్ల శివకుమార్, నాగేందర్, మేగ్యానాయక్, రాఘవేందర్రావు, సతీశ్రెడ్డి, ఐఐటీ-నీట్ అకాడమీ ఇన్చార్జి పావని, షాకీర్ పాల్గొన్నారు.