జడ్చర్లటౌన్, జూన్ 28: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రతిభ కనబర్చి ఉత్తీర్ణతను సాధించారు. జడ్చర్లలోని కోఎడ్యుకేషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ఎం శివకుమార్ బైపీసీలో 962మార్కులు సాధించి టౌన్ టాపర్గా నిలిచాడు. ఎంపీసీలో జే నందిని 937మార్కులు సాధించి టౌన్ టాపర్గా నిలిచింది. సీఈసీలో అప్షభాను 852మార్కులు సా ధించింది. సీటీ ఒకేషనల్ విభాగంలో పి. రాఘవ 743 మా ర్కులు, ఈటీ ఒకేషనల్ విభాగంలో బీ వంశీ 866 మార్కు లు, ఏఈటీ ఒకేషనల్ విభాగంలో జే శివానంద్ 763మార్కులు సాధించారు. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో రిషివర్ధన్గౌడ్ 453మార్కులు, బైపీసీలో శంకర్నాయక్ 431మార్కులు, సీఈసీలో ఎండీ సమీర్ 434మార్కులు, సీటీ ఒకేషనల్లో ఎస్ మల్లేశ్గౌడ్ 424మార్కులు, ఈటీ ఒకేషనల్లో ఎస్ చంద్రశేఖర్ 457మార్కులు, ఏఈటీలో ఎండీ అహ్మద్పాషా 374మార్కులు సాధించారు.
బాలికల జూనియర్ కళాశాలలో..
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం బైపీసీలో సమతాహేర్ 945 మార్కులు, అర్చన 815మార్కులు, సానియాబేగం 740మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ఎంపీసీలో సీ సాక్షి 906మార్కులు, కే స్వరూప 841మార్కులు సాధించారు. సీఈసీలో టీ అక్షయ 818మార్కులు, ఆసియాబేగం 852 మార్కులు సాధించారు. హెచ్ఈసీలో తబస్సుం 838మార్కులు, సుప్రియ 616మార్కులు సాధించారు. ఒకేషనల్ కోర్సు విభాగంలో స్వాతి 894మార్కులు, ఎన్ అనూష 919 మార్కులు సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో ఉమ, అబేదా 414మార్కులు సాధించారు. బైపీసీలో ముస్కాన్కౌసర్ 422మార్కులు, పౌజియా తబస్సుం 420మార్కులు, పావని 407మార్కులు, శ్రావణి 407మార్కులు సాధించారు. సీఈసీలో సీ పల్లవి 461 మార్కులు, నబిత 415మార్కులు సాధించారు. ఒకేషనల్కోర్సులో కే విజయ 462మార్కులు, జే శాంతి 481 మార్కులు సాధించారు.