నారాయణపేట, జూన్ 25 : పట్టణంలోని జిల్లా కోర్టులో ఆదివారం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అ దాలత్ను జిల్లాలోని కక్షిదారులు సద్వినియోగం చే సుకోవాలని జిల్లా న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ పడదలిచిన క్రిమినల్, సివిల్ ఇ తర కేసులు లోక్ అదాలత్ నుంచి సత్వరమే పరిష్కరించుకోవచ్చన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్, భూ తగాదాలు, ఎక్సైజ్, మోటరు వాహనాలు, చిట్ ఫండ్, చెక్ బౌ న్స్తోపాటు రాజీ పడదగిన అన్ని రకాల కేసులను ఆ దివారం లోక్ అదాలత్లో పరిష్కరిస్తామన్నారు. కే సుల పరిష్కారానికి పేట కోర్టులో మూడు బెంచీలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కేసుల పరిష్కా రం కోసం సంబంధిత న్యాయవాదులను ఇప్పటికే ప్రకటించామన్నారు.
జిల్లా కోర్టులో ప్రీ సిట్టింగ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజీ పడదగు కక్షిదారులు తమ న్యాయవాదులతో కలిసి కోర్టుకు నేరుగా హాజరు కావాలని సూచించారు. ఎలాంటి సహా యం, సలహా అవసరమైనా న్యాయ సేవాధికార సం స్థను ఆశ్రయించాలన్నారు. క్షణికావేశం, అనివార్య కారణాల వల్ల జరిగిన కేసులతో ఇబ్బందులు పడుతున్న వారు సైతం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.