మూసాపేట, జూన్ 25 : మండలంలోని సం కలమద్ది గ్రామ శివారులో ఉన్న డీకేఆర్ అలివేలమ్మ భారత్ పెట్రోల్ బంక్లో డీజిల్, పెట్రోల్ తక్కువగా వచ్చిందని శనివారం వాహనదారులు నిర్వాహకులతో వాగ్విదానికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. ఎండీ అబ్దుల్లా లారీలో డీజిల్ తక్కువగా ఉండి రిజర్వలోకి వచ్చిందని డీకేఆర్ అలివేలమ్మ భారత్ పెట్రోల్ పంప్లో రూ.6వేలు చెల్లించి పో సుకున్నాడు.
అయినా లారీ ఆన్లోకి రాకుండా రిజర్వలోనే ఉండడంపై అనుమానం వచ్చి ట్యా ంకులో డీజిల్ పరిశీలించి చూస్తే చెల్లించిన డబ్బులకు సగం కూడా రాలేదని పెట్రోల్ బంక్ నిర్వాహకులతో ఎండీ అబ్దుల్లా వాగ్విదానికి దిగాడు. అదేవిధం గా మరో కారులో కూడా పెట్రోల్ పోసుకుంటే చాలా తక్కువగా వచ్చిందని అతను కూడా వాగ్విదానికి దిగినట్లు స్థానికులు తెలిపారు. లారీ డ్రైవర్ చాలా సమయం వేచి ఉన్నా పట్టించుకోకపోవడంతో చేసేది ఏమీ లేక అతను బూతులు తిట్టుకుంటూ వెళ్లాడు. పెట్రోల్ బంక్లను పరిశీలించాల్సిన అధికారులు కార్యాలయాలను వదిలి బయటికి రాకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.