వనపర్తి, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ఆయిల్పాం తోటల సాగుతో ఆమ్దానీ మస్తుగుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఒక్క రోజే జిల్లాలోని 11 మండలాలు.. 29 గ్రామాల్లో.. 71 మంది రైతులకు చెందిన 330 ఎకరాల్లో 15 వేల ఆయిల్పాం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు సంప్రదాయ సాగు నుంచి బయటకు రావాలని సూచించారు. అప్పుడే కర్షకులు నికర ఆదాయం సంపాదిస్తారని తెలిపారు.
దేశంలో బైబ్యాక్ గ్యారంటీ పాలసీ ఉన్న ఏకైక పంట ఆయిల్పాం అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో తోటల సాగే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు. ప్రతి ఏటా రూ.80 వేల కోట్ల విలువైన వంట నూనెలను మన దేశం దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. అందుకే నూనెగింజల సాగుకు అన్నదాత ఆసక్తి చూపాలని సూచించారు. 79 క్షేత్ర పర్యటనల ద్వారా 8,460 మంది రైతులకు ఆయిల్పాం సాగు, ఇతర అంశాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. వరి మినహా అన్ని రకాల పంటలను ఈ తోటల్లో అంతర్ పంటలుగా సాగు చేయొచ్చన్నారు. నూనె, పప్పు గింజల సాగువైపు రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు పోతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఈ తోటలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో 2022-23 ఏడాదిలో తొలి విడుతగా 3,420 ఎకరాల్లో ఈ తోటల సాగే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. కాగా జూన్ నెల వరకు 342 ఎకరాల్లో ఆయిల్పాం తోటలను సాగు చేసినట్లు తెలిపారు. నర్సరీలో 3 వేల ఎకరాలకు సరిపడే 1.80 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నేటి వరకు జిల్లాలో 1,059 మంది రైతులు 4014 ఎకరాల్లో ఆయిల్పాం తోటల సాగుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వనపర్తి మండలం చిట్యాల గ్రామంలో ముష్టి బాలీశ్వర్ 5 ఎకరాల పొలంలో, అలాగే పెద్దగూడెం గ్రామవాసి గణేశ్కు చెందిన నాలుగున్నర ఎకరాల్లో మంత్రి మొక్కలు నాటారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎంపీపీ కిచ్చారెడ్డి, టీఆర్ఎస్ శిక్షణా తరగతుల కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, టీఆర్ఎస్ నేత తిరుమల మహేశ్, అయిల్పాం కంపెనీ డీజీఎం రామ్మోహన్రావు, ఉద్యానవన శాఖాధికారి సురేశ్, వనపర్తి మండల అధ్యక్షుడు మాణిక్యం, సింగిల్ విండో చైర్మన్ వెంకట్రావు, మండల యూత్ అధ్యక్షుడు చిట్యాల రాము, పట్టణ ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్, చిట్యాల సర్పంచ్ భానుప్రకాశ్, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
విద్యాహబ్గా వనపర్తి
వనపర్తి, జూన్ 25: వనపర్తి విద్యాహబ్గా మారిందని, ప్రభుత్వ మెడికల్, జేఎన్టీయూ, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుతో జిల్లా ఖ్యాతి మరింత పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మాణం జరుగుతున్న మెడికల్ కళాశాల వద్ద రూ.4 కోట్లతో చిల్డ్రన్స్హోం, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవన నిర్మాణానికి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటుతో మహిళలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వనపర్తి వాసులకు అన్ని రకాల విద్య అందుబాటులో ఉండాలన్నదే లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఇప్పటికే మత్స్య కళాశాల ఏర్పాటు చేశామని, ప్రస్తుతం మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల రాకతో వనపర్తికి కొత్త కళ రానున్నదన్నారు. కేజీ నుంచి పీజీ వరకు కాదు.. మెడికల్, జేఎన్టీయూ, ప్రభుత్వ ఇంజినీరింగ్ ఇక్కడ చదివే అవకాశం ఉందన్నారు. మొదటి నుంచి విద్యారంగంలో అగ్రభాగాన ఉన్నదని, 1958లోనే ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటైందన్నారు. వనపర్తికి మరింత వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పాల్గొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ర్టాభివృద్ధి
వంగూరు, జూన్ 25 : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వంగూరు మండలం రంగాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన సీపీఎం పార్టీ వార్డు సభ్యులు లక్ష్మయ్య, మల్లయ్యతోపాటు మరో 50 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి స్వగృహంలో చేరిన వీరికి కండువాలు కప్పి పార్టీలోకి నిరంజన్రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేక కేంద్రం నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తెలంగాణకు అవార్డులు ఇస్తుంటే బీజేపీ నేతలు మాత్రం విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో రాష్ర్టాలను అధిగమించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. వ్యవసాయ రంగానికి ఇప్పటి వరకు రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. విపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు సీఎం కేసీఆర్ వైపే ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, నాయకులు ఆనంద్రెడ్డి, నర్సింహారెడ్డి, రామస్వామి, శరత్రెడ్డి, సాయిబాబా పాల్గొన్నారు.