కొత్తకోట, జూన్ 21: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మన పథకాలు అమలుకావడం లేదని అలాంటి నాయకుల వెంట వెళ్తే మనకు ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కొత్తకోట మున్సిపల్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటికి నుంచి కాంగ్రెస్ నాయకులే రాష్ర్టాన్ని పాలిస్తూ పోయారని, రాహుల్గాంధీ ఇటీవలే రాష్ట్రంలో పర్యటించి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వేడుకోవడం సిగ్గు చేటన్నారు. బీజేపీ నేతలు సైతం చిన్నపిల్లల మాదిరి నాకోక చాక్లెట్ అన్నట్లుగా వేడుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బాలుర పాఠశాలలో రూ.83లక్షలతో నిర్మిస్తున్న అదనపు గదులకు, రూ.17.78 లక్షలతో నిర్మిస్తున్న ప్రాథమిక పాఠశాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
అనంతరం 14మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కొత్తకోట పట్టణానికి చెందిన నలుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన మైనూన్ కతూన్కు రూ.2లక్షలు, మంజుల యాదయ్యసాగర్కు రూ.2లక్షలు, శ్రీనుకు రూ.2లక్షల 50వేలు, మణెమ్మకు రూ.47వేలు విలువ గల చెక్కులను బాధితులకు అందజేశారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడారు.
మున్సిపల్ కార్యాలయంలో యోగా దినోత్సవ ఆసనాల క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ వామన్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, వైస్ చైర్పర్సన్ జయమ్మ, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మ డి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, తాసిల్దార్ బాల్రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు కొండారెడ్డి, కౌన్సిలర్లు రాములుయాదవ్, సంధ్య, పద్మాఅయ్యన్న, తిరుపతయ్య, రామ్మోహన్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు మిషేక్, వాహిద్, సుజాత, పార్టీ పట్టణాధ్యక్షుడు బాబురెడ్డి, మహిళా పట్టణ అధ్యక్షురాలు ప్రసన్నలక్ష్మి, మండల మహిళ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, నాయకులు భీంరెడ్డి, శ్రీను జీ, రాములుయాదవ్, నర్సింహాగౌడ్, సుభాష్, ఉమామహేశ్వర్రెడ్డి, హనుమంతుయాదవ్, పీజేబాబు పాల్గొన్నారు.
బీజేపీ నేతకు కల్యాణలక్ష్మి
తెలంగాణ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. కొత్తకోట పట్టణానికి చెందిన బీజేపీ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ భరత్భూషణ్ కూతురుకు ఇటీవలే వివాహమైనది. వారికి మంజూరైన కల్యాణలక్ష్మి రూ.లక్షా116 చెక్కును భరత్భూషన్ భార్య హైమావతికి మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు.