నాగర్కర్నూల్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : నా గర్కర్నూల్ జిల్లాగా ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. నాగర్కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో అభివృద్ధి మరో మెట్టుకు ఎదిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతలు సాధిస్తున్నది. ఎంజీకేఎల్ఐ పూర్తి కావడంతో వేరుశనగ, వరి, పత్తి పంటలతో సేద్యం సంబురంగా సాగుతున్నది. అలాగే గ్రామాలకు, పట్టణాలకు సుందరమైన రోడ్లు వేశారు. రూ.వందల కోట్లతో అభివృద్ధి, సంక్షేమం విజయవంతంగా అమలవుతున్నాయి. కాగా, ఇటీవలే ఆయా నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
నాగర్కర్నూల్లో అభివృద్ధి పనులు..
నాగర్కర్నూల్ నియోజకవర్గ కేంద్రం జిల్లాగా ఏర్పడిన తరువాత ముఖచిత్రమే మారిపోయింది. ఉయ్యాలవాడ నుంచి కొల్లాపూర్ చౌరస్తా వరకు ప్రధాన రహదారి పచ్చదనం పరుచుకున్నది. డివైడర్ల మధ్య, రోడ్లకిరువైపులా ఏర్పాటు చేసిన మొక్కలు కొత్త శోభను తీసుకొచ్చాయి. డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బల్బులు రాత్రి వేళ పగటిని తలపిస్తున్నాయి. ఇక కొ త్తగా కలెక్టరేట్, పోలీసు భవన సముదాయం, తాజాగా మెడికల్, నర్సింగ్ కళాశాలలు, డయాలసిస్, పాలియేటివ్ కేంద్రాలు మంజూరు కావడం విశేషం. పట్టణం నలుదిక్కులా రియల్ రంగం విస్తరించింది. కొత్త కొత్త భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మాణమవుతున్నాయి. జి ల్లా దవాఖాన 300 పడకలుగా మారనున్నది. అలాగే పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకులు, కా ర్లు, ట్రాక్టర్ల షోరూంలు, రెస్టారెంట్ల వంటి కొత్త వ్యాపారాలు జోరందుకున్నాయి. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ చివరి దశలో ఉన్నది. దీంతోపాటు మినీ ట్యాంక్ బండ్ పట్టణానికి కొత్త నగిషీ తీసుకొచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం, లవ్ ఎన్జీకేఎల్, జాతీయ జెండా, బతుకమ్మ ఘాట్, లేజర్ షో, ఇటీవలే ఏర్పాటు చేసిన హైదరాబాద్ ట్యాంక్బండ్ తరహాలోని లైట్లతో ఈ ట్యాంక్బండ్ ప్రజలకు ఆహ్లాదం అందిస్తున్నది.
ఇక జనాభా పెరగడంతో ప్రస్తుతమున్న రైతుబజార్ సరిపోవడం లేదు. దీనిస్థానంలో పాత మార్కెట్ స్థలంలో కొత్తగా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. మున్సిపాలిటీలో జనాభా పెరగడంతో చెత్త పెద్ద ఎత్తున పోగవుతున్నది. దీనికోసం పాత మార్కెట్ వద్ద డంపింగ్ యార్డుతోపాటు వైకుంఠధామం నిర్మాణం కానున్నది. ఇక ప్రజావసరాలకు అనుగుణంగా నూతనంగా మున్సిపాలిటీ కార్యాలయం నిర్మిస్తున్నారు. ప్రస్తుత కార్యాలయం అధికారులు, సిబ్బందికే సరిపోవడం లేదు. సమస్యలు, పనుల కోసం వచ్చే ప్రజలకు పాత భవనంలో నిలబడే స్థలం కూడా లేదు. కొత్త భవనం పూర్తవడంతో పాలకవర్గానికి, ప్రజలకు సౌలభ్యం చేకూరనున్నది. ఇప్పటివరకు దాదాపుగా రూ.30 కోట్లతో పట్టణంలో సీసీ రోడ్లు వేశారు. మరో రూ.20 కోట్లతో మిగిలిన వీధుల్లో సీసీ రోడ్లు వేయనున్నారు.
ఇక కొల్లాపూర్ నియోజకవర్గంలోనూ గోపల్దిన్నె గ్రావిటీ కెనాల్ పనులకు (రూ.147.10కోట్లు) సింగో టం వద్ద శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పెంట్లవెల్లిలో 11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన, పట్టణంలో రూ.10.30 కోట్లతో డివైడర్ పనులకు ఈ నెల 18వ తేదీన పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆయా శాఖల అధికారులకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యనిర్వాహకులైన మంత్రి కేటీఆర్ జిల్లాకు రానుండడంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తున్నది. భారీ ఎత్తున జనం తరలి వచ్చేందుకు ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు. కొల్లాపూర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం కొల్లాపూర్, నాగర్కర్నూల్లో జరిగే బహిరంగ సభల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత నాగర్కర్నూల్కు చేరుకుంటారు. హెలికాప్టర్లో వచ్చే అవకాశం ఉండడంతో హెలీప్యాడ్ కోసం అధికారులు జిల్లా కేంద్రంలో స్థలాన్ని పరిశీలించారు.
నాగర్కర్నూల్లో కార్యక్రమాలు..
కొల్లాపూర్లో..