మదనాపురం, జూన్ 10 : పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించి వారి సొంతింటి కల నెరవేరుస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో నిర్మించిన 40 డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులను శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ పేదలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. త్వరలోనే కస్తూర్బాగాంధీ విద్యాలయం, డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. లబ్ధిదారుల ఎంపి క పారదర్శకంగా చేపట్టామన్నారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి, క్రీడాకారుల తో కలిసి వాలీబాల్ ఆడారు. క్రీడాకారుల్లో నైపుణ్యం పెం పొందించడానికే ప్రతి గ్రామంలో మైదానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిర్మలాయపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే ఆల, సర్కార్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తా సిల్దార్ సంధ్య, ఎంపీడీవో నాగేంద్రం, డీటీ అశోక్, ఆర్ఐ భాస్కర్రెడ్డి, ఎంపీపీ పద్మావతి, జెడ్పీటీసీ కృష్ణయ్య, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్నారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి మాసన్న, సర్పంచులు రాంనారాయణ, శారద, శివశంకర్, కో ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, ఎంపీటీసీలు సరస్వతి, శాంతమ్మ, శరత్రెడ్డి, నాయకులు రాజ్కుమార్, ప్రవీణ్రెడ్డి, కుర్మన్న, కృష్ణ, బాలకృష్ణ, శంకర్బాబు, వాసురెడ్డి, శ్రావణ్కుమార్రెడ్డి, రంగన్న, శేఖరాచారి తదితరులు పాల్గొన్నారు.