ఊట్కూర్, జూన్ 5 : గ్రామాల అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జెడ్పీ సీఈవో సిద్ధి రామప్ప అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని కొల్లూరులో ఆదివారం పర్యటించి పారిశుధ్య పనుల ను పరిశీలించారు. పల్లె ప్రగతిలో ప్రధానంగా పారిశుధ్య ని ర్వహణ, మొక్కల సంరక్షణ పనులు చేపట్టాలని తెలిపారు. పచ్చదనం పెరిగేలా మొక్కలు నాటడంతోపాటు గ్రామాల ను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. మండలకేంద్రంలోని 1, 6వ వార్డుల్లో పంచాయతీ కార్యదర్శి సుమల త ఆధ్వర్యంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు. కార్యక్రమం లో సర్పంచులు సూర్యప్రకాశ్రెడ్డి, సరోజ, ఎంపీటీసీ విజయలక్ష్మి, ఎంపీడీవో కాళప్ప, ఉపాధి ఏపీవో ఎల్లయ్య, ఈసీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
కర్నిలో…
మక్తల్ రూరల్, జూన్ 5 : మండలంలోని కర్నిలో పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో శ్రమదానం నిర్వహించారు. గ్రామం నుంచి గుంటి రంగస్వామి ఆలయానికి వెళ్లే రహదారి పక్కన కంప చెట్లు, చెత్త, కాలువలలో మురుగు నీటిని తొలగించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బస్వరాజ్, సర్పంచ్ అక్రమ్, ఎంపీటీసీ రంగప్ప, కార్యదర్శి లక్ష్మీదేవి, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ శైలజ, ఉపసర్పంచ్ కృ ష్ణయ్యగౌడ్, వీఆర్ఏ విజయ్కుమార్, వార్డు స భ్యులు తదితరులు పాల్గొన్నారు.
గుడెబల్లూర్లో…
కృష్ణ, జూన్ 5 : పరిసరాల పరిశుభ్రతను ప్రతిఒక్కరూ పాటించాలని సర్పంచ్ మహదేవమ్మ సూచించారు. మండలంలోని గుడెబల్లూర్లో పల్లె ప్రగతిలో భాగంగా గ్రామం లో నిర్వహించిన పారుశుధ్య పనులను ఆదివారం సర్పంచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రా మం పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడేందుకు ప్రభు త్వం ప్రత్యేక కార్యాచరణతో పనులు చేపట్టిందన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించుకోవాలని ప్రజలను కోరారు. కార్మికులు రోడ్లపై చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
మొగల్మడ్కలో…
దామరగిద్ద, జూన్ 5 : మండలంలోని మొగల్మడ్కలో పల్లె ప్రగతిలో భాగంగా ఆ దివారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్రధాన రోడ్లను ఊడ్చి శు భ్రం చేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి యాదయ్యగౌడ్, కార్యదర్శి వెంకట్రెడ్డి, ఉపసర్పంచ్ బుగ్గప్ప, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
పనులు పరిశీలన
నారాయణపేట రూరల్, జూన్ 5 : క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎదగాలని కలెక్టర్ హరిచందన అన్నారు. మండలంలోని అప్పిరెడ్డిపల్లిలో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను ఆదివారం కలెక్టర్ తనిఖీ చేశా రు. గ్రామంలోని నర్సరీని పరిశీలించి మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పండ్ల మొక్కలు పంపిణీ చేయాల ని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడకారులు గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామ పంచాయతీ లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో డీపీవో మురళి, మండల స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, సర్పంచ్ పాల్గొన్నారు.
లక్కిరిదొడ్డిలో…
నర్వ, జూన్ 5 : మండలంలోని లక్కిరిదొడ్డిలో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను ఆదివారం ఎంపీపీ జయరాములు శెట్టి పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, అంటు వ్యాధుల నిర్మూలన, పల్లె ప్రగతిలో పూర్తి చేయాల్సిన పనులపై ప్రజాప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ శివన్న, వార్డు సభ్యులు, గ్రామ సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.