భూత్పూర్, జూన్ 4 : రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మండలంలోని పోతులమడుగు గ్రామశివారులో రూ.3కోట్ల 50లక్షలతో మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా గ్రామ మహిళలతో మంత్రి మాట్లాడి ఇంటింటికి మిషన్ భగీరథ నీరు, పింఛన్లు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం భూత్పూర్లో వెజ్-నాన్వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూత్పూర్ నుం చి వెల్కిచర్ల వరకు రూ.10కోట్లతో బీటీరోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే సిద్దాయపల్లిలో నిర్మించిన 288 డబుల్బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. డబుల్బెడ్రూం ఇండ్లను పరిశీలించి లబ్ధిదారుల వివరాలను తెలుసుకున్నా రు. అనంతరం అమిస్తాపూర్ బహిరంగసభ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సభకు పెద్దఎత్తున తరలివచ్చారు.
దేవరకద్ర రూరల్, జూన్ 4 : బీడు భూములను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కేటీఆర్ అన్నారు. దేవరకద్ర మండలం వెం కంపల్లి గ్రామశివారులో రూ.51కోట్లతో పేరూర్ లిఫ్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పేరూర్ లిఫ్ట్ నిర్మాణంతో పేరూర్, వెంకంపల్లి, రేకులంపల్లి, వెంకటగిరి, అమ్మాపూర్, దాసర్పల్లి గ్రామాల్లో సుమారు 3,500 ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు. పేరూర్ లిఫ్ట్ కల సాకారమవుతుండడంతో ఈ ప్రాంత రైతుల కండ్లల్లో ఆనందం కనిపిస్తున్నదన్నారు. ఈ లిఫ్ట్పై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులను మంజూరు చేయించారని చెప్పారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని రెండు వాగుల్లో నిర్మించిన 21 చెక్డ్యాంలతో రైతులకు ఎంతో మేలు చేకూరిందన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. అలాగే పంట కాలానికి ముందే ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
రైతుకోసం ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రికి అందరం రుణపడి ఉండాలని పేర్కొన్నారు. అంతకుముందు వెంకంపల్లిలో మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, గువ్వల బాలరాజు, కలెక్టర్ వెంకట్రావు, గిరిజన కా ర్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, ఎంపీ పీ శేఖర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీలు రమాదేవి, హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్ఎంపీపీ సుజాత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొండా సుగుణ, సర్పంచులు మురళీధర్రెడ్డి, చామన్కుమార్, స్వా మి, కమలమ్మ, తాసిల్దార్ చెన్నకిష్టన్న, కౌన్సిలర్లు బాలకోటి, శ్రీనివాస్రెడ్డి, రామృష్ణ, కృష్ణవేణి, గడ్డం నాగమ్మ, నాయకులు సత్యనారాయణ, రాము, మన్యానాయక్ పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న వెజ్-నాన్వెజ్ మార్కెట్ రోడ్డుకు స్థలాన్ని ఇచ్చిన దాతలు సత్తూర్ నారాయణగౌడ్, అశోక్గౌడ్, తిరుపతయ్యగౌడ్లను మంత్రి కేటీఆర్ సన్మానించి అభినందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నారాయణగౌడ్ ఇంట్లో మంచి భోజనం చేశానని మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
మూసాపేట(అడ్డాకుల), జూన్ 4 : అడ్డాకుల మండలంలోని బలీదుపల్లి జాతీయరహదారి నుంచి కురుమూర్తిరోడ్డు వరకు బీటీరోడ్డు, వర్నె వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, గువ్వ ల బాలరాజుతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే జాతీయరహదారి నుంచి గుడిబండకు రూ.1.60కోట్లతో చేపట్టనున్న బీటీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన గావించారు. మూసాపేట మండలంలోని వేముల కోజెంట్ గ్లాస్ పరిశ్రమలో నూతనంగా నిర్మించిన యూనిట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు నల్లమద్ది రాజశేఖర్రెడ్డి, గడ్డమీది ఇంద్రయ్యసాగర్, ఎంపీపీలు దోనూరు నాగార్జునరెడ్డి, గూపని కళావతీకొండయ్య తదితరులు పాల్గొన్నారు.