నాగర్కర్నూల్, జూన్ 4 : నాగర్కర్నూల్ జి ల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డున ఉన్న బీసీ కాలనీలో దారుణం చోటు చేసుకున్నది. మూ డు రోజుల కిందట కనిపించకుండాపోయిన అదే కాలనీకి చెందిన బాలిక సుగుణ(8) శవమైంది. వారు నివాసం ఉంటున్న ప్రాంతం లో నిలిపి ఉన్న కారు (ఏపీ 28 డీసీ 7459) లో శవమై కనిపించడంతో కాలనీలో కలకలం రేపింది. కారులో నుంచి దుర్వాసన రావడం తో కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు.
శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై విజయ్కుమార్ తన సిబ్బందితో అదే కారులో జిల్లా దవాఖాన మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. బాలిక తల్లి అంజమ్మ కన్నీరుమున్నీరైంది. ఎస్సై కథనం మేరకు.. 2న ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయిన సుగుణ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు చేయడంతో అదేరోజు రాత్రి ఘటనా స్థలానికి చేరుకొని కారులో మృతదేహం ఉందని, అంజమ్మ కూతురుగా గుర్తించారు. మూడ్రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయింది. కారు యాజమానిపై అనుమానం వ్యక్తం చేస్తూ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. సీసీ ఫుటేజీలో కారు చుట్టుపక్కల ఆడుతున్నట్లు ఉన్నది. అయితే అదే కారులో శవమై కనిపించడం తో కాలనీ వాసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.