దేవరకద్ర రూరల్, జూన్ 3 : పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి పిలుపునిచ్చారు. చిన్నచింతకుంట మండలం మద్దూర్లో నిర్వహించిన ఐదోవిడుత పల్లెప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భం గా అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో మాట్లాడారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల, పేరూర్, వెంకంపల్లి తదితర గ్రామాల్లో నిర్వహించిన పల్లెప్రగతిలో ఎంపీపీ రమాదేవి పాల్గొని సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, వైస్ఎంపీపీ సుజాత, ఎంపీటీసీ కిష్టన్న, ఎంపీడీవోలు శ్రీనివాసులు, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సమస్యనూ పరిష్కరించాలి
పట్టణప్రగతి కార్యక్రమంలో గుర్తించిన ప్రతి సమస్యనూ పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో ఏనుగొండలో నిర్వహించిన 2,3,4,5 వార్డు కమిటీల సమావేశంలో మాట్లాడారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికారులు, కౌన్సిలర్లు ఇంటింటికెళ్లి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రా మాంజనేయులు, యాదమ్మ, వనజ, మాజీ కౌన్సిలర్ జ్యోతి, నాయకులు హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
అందరూ భాగస్వాములు కావాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదోవిడుత పల్లెప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ అనంతయ్య కోరారు. పల్లెప్రగతిలో భాగంగా కాకర్లపహాడ్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీపీ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి సమస్యనూ గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా అన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించి చేపట్టాల్సిన పనులపై తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీలత, ఎంపీవో భద్రూనాయక్, డిప్యూటీ తాసిల్దార్ లిఖితారెడ్డి, మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ పాశం గోపాల్, సర్పంచులు జంగమ్మ, లలితమ్మ, బొజ్జమ్మ, గంగ మ్మ, నర్సింహానాయక్, గోపాల్గౌడ్. జయమ్మ, లక్ష్మమ్మ, జంగయ్య, వసుంధర, రాణెమ్మ, గౌసియాబేగం, లక్ష్మారెడ్డి, యాదయ్యయాదవ్, కావలి సత్యం, పాండురంగారెడ్డి, సురేందర్, అంకూరి సత్యం, నిర్మలమ్మ, వెంకట్, జమున, వెంకటేశ్, లత, అలివేలు, పద్మ, సౌజన్య, సోనీబాయి, రజిని, కృష్ణయ్య, యాదమ్మ, పావని, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే ‘పల్లెప్రగతి’
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని మద్దిగట్లలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమానికి హాజరై సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మున్ని, ఎంపీవో విజయకుమార్, సర్పంచ్ ప్రియాంకారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సునీల్, ఉపసర్పంచ్ శేఖర్ పాల్గొన్నా రు. అదేవిధంగా భూత్పూర్ మున్సిపాలిటీలోని పదోవార్డులో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి లక్షా 20వేల లీటర్ల సామర్థ్యంగల వాటర్ట్యాంకు నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నూరుల్నజీబ్, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయిలు, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, నాయకులు సత్తూర్ నా రాయణగౌడ్, గడ్డంరాములు, సత్యనారాయణ, బోరింగ్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
పల్లెల అభివృద్ధికి పెద్దపీట
పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసి నిధులను కేటాయిస్తున్నదని జెడ్పీటీసీ శశిరేఖ అన్నారు. మండలంలోని కొత్తూర్, బోయిన్పల్లి, మల్లాపూర్, చిల్వేర్, వాడ్యాల్, కొత్తపల్లి తదితర గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. మల్లాపూర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, పాఠశాల భవన మరమ్మతు పనులకు జెడ్పీ నిధులు రూ.8లక్షల 50వేలను మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎల్పీవో వరలక్ష్మి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జంగారెడ్డి, మహిళా సంఘం అధ్యక్షురాలు సుగుణమ్మ, సర్పంచులు రాధికారెడ్డి, సంయుక్తారాణి, మంగమ్మ, ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంపీవో అనురాధ పాల్గొన్నారు.
సమిష్టిగా పనిచేయాలి
పల్లెల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేయాలని ఎంపీపీ సుశీల, జెడ్పీటీ సీ మోహన్నాయక్ అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగం గా ఖానాపూర్, తిర్మలాపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యల ను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో వెంకట్రాములు, సర్పంచులు యాదమ్మ, మహేశ్వరి పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శం
ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జెడ్పీటీసీ కల్యాణి అన్నారు. మండలంలోని ఉడిత్యాలలో నిర్వహించిన పల్లెప్రగతిలో పాల్గొని సమస్యలను తెలుసుకున్నారు. అలాగే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రణాళికాబద్ధంగా పల్లెప్రగతి పనులను చేపట్టి గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలని సూ చించారు. అలాగే పెద్దాయపల్లి, చిన్నరేవల్లి, వాయిల్కుంటతం డా, గౌతాపూర్ గ్రామాల్లో సభలు నిర్వహించి సమస్యలపై చ ర్చించారు. కార్యక్రమంలో గిరిజన నాయకుడు లక్ష్మణ్నాయక్, సర్పంచులు మల్లేశ్యాదవ్, శంకర్, గోపీనాయక్, రమేశ్, ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్, ఎంపీటీసీ ప్రదీప్కుమార్గౌడ్, చిన్న శంకర్నాయక్, ప్రేంకుమార్, నర్సింగ్రావు, శంకర్నాయక్, కార్యదర్శులు అనిల్కుమార్, దస్రూరాథోడ్ పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
మండలంలోని అన్ని గ్రామపంచాయతీ ల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామసభలు నిర్వహించి చేపట్టాల్సిన పనులపై చర్చించి తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు రాజేశ్వర్రెడ్డి, ప్రణీల్చందర్, బాలసుందర్రెడ్డి,, రవీందర్రెడ్డి, నర్సింహులు, మమతానవీన్రెడ్డి, హై మావతీవెంకట్రెడ్డి, శ్రీనివాసులు, భారతి, ప్రభాకర్రెడ్డి, అరుణాసత్యనారాయణ, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలను తెలుసుకున్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీపీ బాలరాజు కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఏపీఎం సుదర్శన్, ఏవో కిరణ్కుమార్, తాసిల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మండలంలో..
మండలంలోని దివిటిపల్లిలో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామసభ నిర్వహించి సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్ జరీనాబేగం, పం చాయతీ కార్యదర్శి వీరలింగం, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
‘పట్టణప్రగతి’తో మరింత అభివృద్ధి
ప్రభుత్వం చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకుందామని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి పిలుపునిచ్చారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అన్ని వార్డుల్లో కౌన్సిలర్ల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి చేపట్టాల్సిన పనులపై చర్చించి తీర్మానాలు చేశారు. అలాగే కమిషనర్ మహమూద్షేక్తో కలిసి పలు వార్డుల్లో చైర్పర్సన్ పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అన్ని వార్డుల్లో ప్రజలను భాగస్వాములను చేసి పట్టణప్రగతిని విజయవంతం చేయాలని కోరా రు. సీసీరోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలతోపాటు పారిశుధ్య పనులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.