తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వాడవాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను సంబురంగా నిర్వహించారు. జడ్చర్లలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ వెంకట్రావు, పోలీసు కార్యాలయంలో ఎస్పీ వెంకటేశ్వర్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామపంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకం ఆవిష్కరించి రాష్ట్ర అవతరణ వేడుకలను కనులపండువగా నిర్వహించారు.