భూత్పూర్, మే 28 : భూత్పూర్లో జూన్ 4న మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రతి పల్లె నుంచి ప్రజలు భారీ గా తరలిరావాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని అన్నాసాగర్లో శనివారం నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
నియోజకవర్గం లో రూ.117కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు తెలిపారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. మంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. బహిరంగసభకు జనసమీకరణ చేయాలని సూచించారు.
దేవరకద్ర మండలం బస్వాపూర్కు చెందిన సంగీతకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.4లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే అందజేశారు. సంగీత వైద్యఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.4లక్షలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీలు కదిరె శేఖర్రెడ్డి, గుంత మౌనిక, హర్షవర్ధన్రెడ్డి, నాయకుడు శ్రీకాంత్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.