కోస్గి, మే 27 : వచ్చేనెల 4న మంత్రి కేటీఆర్ కోస్గి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి శుక్రవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్టణంలోని లక్ష్మీనర్సింహ గా ర్డెన్ పక్కన ఉన్న మైదానాన్ని బహిరంగ సభ నిమిత్తం ఎం పిక చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని స్థానిక నా యకులకు సూచించారు. పట్టణంలో సమీకృత మార్కెట్, బస్ డిపో, బస్టాండ్, కూరగాయల షెడ్ల నిర్మాణం పనులను పరిశీలించారు. వచ్చేనెల 1 తేదీ లోపు నిర్మాణాలన్నీ పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. కార్యకర్తలు, నాయకులు మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేసేందుకు పె ద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. బందోబస్తుకు ఏర్పాటు చేయాలని సీఐ జనార్దన్గౌడ్కు సూచించారు. కా ర్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ భీంరెడ్డి, పీఏసీసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్, మార్కెట్ వైస్ చైర్మన్ వరప్రసాద్ పాల్గొన్నారు.