నాగర్కర్నూల్, మే 25 (నమస్తే తెలంగా ణ) : కొత్త రైతుకూ వ్యవ‘సాయం’ అందనున్నది. వానకాలం పంట సీజన్ వస్తుండగా.. ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న రైతులకు త్వరలో ప్రభుత్వం రైతుబంధు సాయం అందించనున్నది. కాగా కొత్తగా భూములు కొనుగోలు చేసి పాసు పుస్తకాలు పొందిన కర్షకులకూ పంట పెట్టుబడి సాయం వర్తించేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈనెల 31వ తేదీ వరకు రైతులు సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. గత సీజన్లో నాగర్కర్నూల్ జిల్లాలోని 2,77,000 మంది అన్నదాతలకు రూ.366 కోట్లు సాయం అందగా.. ఈ సీజన్లో 2,90,680 మంది రైతులు సాయం పొందే అవకాశం ఉన్నదని వ్యవసాయ అధికారుల అంచనా. మొత్తమ్మీద రైతుబంధు పథకంలో కొత్త రైతులకు మరోసారి గడువు
పొడిగించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతుబంధు.. తెలంగాణలో సేద్యాన్ని సు సంపన్నం చేస్తున్న బృహత్తర పథకం. దేశం లో ఏ రాష్ట్రంలో లేని ఈ పథకంతో రైతులకు పంటల సీజన్ ఆరంభంలో పెట్టుబడులకు అ ప్పులు చేసే కష్టాలు తీరాయి. ఇలాంటి గొప్ప పథకంతో ప్రతి ఏడాది వానకాలం, యాసంగి సీజన్లలో ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.10 వేలు ఆర్థిక సాయం పొందుతున్నా రు. భూ పరిమితితో సంబంధం లేకుండా రై తన్నలందరికీ ఈ పథకం ద్వారా ఆర్థిక సా యం అందుతున్నది. ఈ గొప్ప పథకం 2018 వానకాలం నుంచి అమలవుతున్నది. తొలుత ఎకరాకు రూ.4వేల చొప్పున అందిన ఈ సాయం.. ధరల పెరుగుదలతో రైతులు అ డగకుండానే మరో రూ.వేయి చొప్పున పెంచ డం గమనార్హం. ఈ పథకం ద్వారా ప్రస్తుత వానకాలం సీజన్లో రైతులకు త్వరలో ఆర్థిక సాయం జమ కానున్నది. ప్రభుత్వం ఎలాం టి మధ్యవర్తిత్వం, వ్యయప్రయాసలు లేకుం డా నేరుగా రైతుల ఖాతాల్లోనే ఈ డబ్బులు జమ చేస్తున్నది. కాగా, కొత్త రైతులకు సైతం ఈ సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికోసం రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. వివిధ కారణాలతో చాలా మంది రైతుబంధు సాయానికి దూ రంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి, ఎంజీకేఎల్ఐవంటి ప్రాజెక్టులకు సేకరించిన భూములను పెండింగ్లో పెట్టడంతో పలువురు రైతులకు సాయం అం దలేదు. అలాగే ఆధార్, బ్యాంకు ఖాతాల నెం బర్లు తప్పులుగా ఉండడంతో కూడా రైతులు ఈ సాయానికి దూరమవుతున్నారు. ఒక స ర్వే నెంబర్తో రెండు పుస్తకాలు ఉండడం కూ డా కారణమవుతున్నది. ముఖ్యంగా భూము లు కొనుగోలు చేసిన రైతులకు రావాల్సిన పా సు పుస్తకాలు పెండింగ్లో ఉంటున్నాయి. ఇ లా కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతుల కూ ఈ అవకాశం ఎంతో ఉపయోగపడుతుం ది.
అలాగే రైతులు మృతి చెందగా వారసుల వివరాలు ఆన్లైన్లో నమోదవుతున్నాయి. ఈ వ్యవహారాల్లో జాప్యం జరగడం, నిరంత రం జరుగుతుండడం వంటి కారణాలతో కూ డా పలువురు రైతులు రైతుబంధు సాయాని కి దూరంగా ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీరందరికీ రైతుబంధు ద్వారా పెట్టుబడుల సాయం అం దించేలా ప్రభుత్వం చర్యలు తీ సుకుంటున్నది. నాగర్కర్నూ ల్ జిల్లాలో ఈ సీజన్లో 6.35 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చే యనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా. యాసంగి సీజన్ ఆధారంగా ఈ వానకాలంలోనూ 2,90,680 మందికి సా యం అందే అవకాశం ఉన్నది. గ త సీజన్లో జిల్లాలోని 2.77 లక్షల మందికి రూ.366 కో ట్లు మంజూరయ్యాయి. కొత్త రైతులకు మరోసారి గడువు పొడిగించడంపై హ ర్షం వ్యక్తం చే స్తున్నారు.
ఈనెల 31వరకు దరఖాస్తులు..రైతుబంధు పథకం కింద గత యాసంగి సీజన్లో 2.77 లక్షల మంది రైతులకు రూ.366 కోట్లు మంజూరయ్యాయి. ఈ వానకాలంలోనూ అదే సంఖ్యలో పెట్టుబడి సాయం అందే అవకాశం ఉన్నది. అయితే, కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన, ఇతర కారణాలతో రైతుబంధుకు దూరంగా ఉన్న రైతుల నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. 31 వరకు రైతుబంధుకు ఐప్లె చేసుకోవాలి.
–వెంకటేశ్వర్లు, డీఏవో,నాగర్కర్నూల్