అయిజ, మే 25 : కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రవాహం స్థిరంగా చేరుతున్నది. బుధవారం ఇన్ఫ్లో 16,332, అవుట్ఫ్లో 357 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 100.855 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 34,810 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటిమట్టం 1633 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 1609.77 అడుగులకు చేరినట్లు బోర్డు ఎస్ఈ నాగమోహన్, డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు స్వల్పంగా..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఎగువ నుంచి ఇన్ఫ్లో స్వల్పంగా నమోదవుతున్నది. ఆనకట్టకు ఇన్ఫ్లో 1,527 క్యూసెక్కులు ఉండగా.. ప్రధాన కాల్వకు 427 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 1,100 క్యూసెక్కులు దిగువన ఉన్న సుంకేశుల బ్యారేజీకి చేరుతున్నాయని ఆర్డీఎస్ కర్ణాటక ఏఈ శ్రీనివాస్ తెలిపారు.