మహ్మదాబాద్, మే 25 : మండలంలోని గాధిర్యాల్లో బుధవారం ఆంజనేయస్వామి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. అంజన్న జాతర ఉత్సవాల్లో భా గంగా మూడురోజులపాటు ప్రత్యేక పూజలు చేశారు. చివరిరోజు నూతనంగా తయారు చేయించిన రథంపై ఆంజనేయస్వామి ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా హనుమాన్ నామస్మరణ మార్మోగింది. చిన్నా పెద్ద తేడా లేకుం డా అంజన్న రథాన్ని లాగారు. ఉత్సవాలతో ఆధ్యాత్మిక శో భ సంతరించుకున్నది. అంజన్న ఉత్సవాలకు పరిగి ఎమ్మె ల్యే మహేశ్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మికచింతనతో మానసిక ప్ర శాంతత లభిస్తుందన్నారు. భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం మహిళలు బొడ్రాయికి బోనాలను సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, సర్పం చ్ వెంకట్రాంరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు గోపాల్, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ వెంకటయ్య, నాయకులు గోపాల్రెడ్డి, హన్మయ్య, రాంచంద్రారెడ్డి, కిష్టయ్య, నారాయణ, లక్ష్మీకాంత్రెడ్డి, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.