గద్వాల రూరల్, మే 25 : అన్ని వర్గాల అభివృద్ధే ధ్యే యంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బీరెల్లి గ్రామంలో గం గమ్మదేవి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముం దు గ్రామంలో రజక, ముదిరాజ్ సంఘం నాయకులు ఎ మ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అన్ని వర్గాలకు, కులాలకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. కులవృతిపై ఆధారపడిన రజకులకు డ్రైక్లీనింగ్, ల్యాండ్రీ షాపులకు ఉచిత కరెంట్తోపాటు ప్రతి గ్రామంలో ధోబీఘాట్లను ఏర్పాటు చేశామన్నారు. మత్స్యకారులకు ఇ న్సూరెన్స్ సౌకర్యం కల్పించామన్నారు. కలిసికట్టుగా సోదరాభావంతో ఉండాలన్నారు. ముదిరాజ్లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కోరగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజ, సుభాన్, సర్పంచ్ జయమ్మ, ఎంపీటీసీ రాధమ్మ, జములమ్మ ఆలయ కమిటీ డైరెక్టర్ శంకర్, విద్యాకమిటీ చైర్మన్ శ్రీరాములు, టీఆర్ఎస్ నాయకులు రమేశ్ నాయుడు, నీ లేశ్వర్రెడ్డి, బీచుపల్లి, భగీరథ, వంశీ తదితరులున్నారు.