నాగర్కర్నూల్, మే 24 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ పేదలకు సైతం ఆరోగ్య భద్రత కల్పించేందుకు సర్కార్ అడుగులు వేస్తున్నది. కార్పొరేట్, ప్రైవేట్తో పాటు జిల్లా, ఏరియా దవాఖానకు పరిమితమైన ఆరోగ్య శ్రీ సేవలు ఇక పీహెచ్సీల్లోనూ అమలుచేయనున్నది. పేదల చెంతకు వైద్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న క్రమంలో తాజాగా ఆరోగ్య శ్రీ ద్వారా గ్రామాల్లోని పేదలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయించారు. వచ్చే నెల నుంచి పీహెచ్సీల్లోనూ ఆరోగ్య శ్రీ పథకం అమలు కానుండడంతో పేదలకు ఖరీదైన మందులు సైతం స్థానికంగానే లభించనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దవాఖానల్లో శిశువులు జన్మించినప్పటి నుంచి కేసీఆర్ కిట్ ప్రారంభంతో గుండె, కిడ్నీలు, కాలే యం, క్యాన్సర్లలాంటి ప్రాణాపాయ వ్యాధుల నుంచి రక్షిస్తున్నది. పేదలకు ఎల్వోసీలు, సీఎంఆర్ఎఫ్లతో పాటుగా నిమ్స్, గాంధీ, ఉస్మానియాతో పాటుగా హైదరాబాద్, మహబూబ్నగర్ వంటి పట్టణాల్లో ఉచితంగా చికిత్సలు చేయించుకునేలా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నది. దీని ద్వారా రూ.లక్షలాది విలువైన శస్త్రచికిత్సలు, ఇతర అనారోగ్యాలకు చికిత్సలను పూర్తి ఉచితంగానే అందిస్తోంది. అయితే ఆరోగ్య శ్రీ పథకం గ్రామ స్థాయిలో లేకపోవడంతో స్థానికంగా చికిత్సలు తీసుకుంటున్న పేద ప్రజలకు ఆర్థిక భారంగా మారిం ది.
గ్రామాల్లోనే వైద్యం అందేలా ప్రభుత్వం పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. దీనికితోడుగా వైద్యరంగంలో మ రింత దృష్టి సారించి ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్, నర్సిం గ్ కళాశాలలు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, జిల్లా దవాఖానలు, సీహెచ్సీల్లో, ఏరియా దవాఖానల్లో బెడ్ల సంఖ్యను పెంచుతున్నది. అలాగే డయాలసిస్, ఐసీయూ కేంద్రాలను ఏర్పా టు చేసింది. ప్రస్తుతం ప్రైవేట్ వైద్యశాలల్లో పాటుగా ప్రభు త్వ ఏరియా దవాఖానల్లో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారు. ఇలా పేదల చెంతకు వైద్యాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం తా జాగా పీహెచ్సీ స్థాయిలో వచ్చే నెల నుంచి ఆరోగ్యశ్రీని అ మలు చేయనున్నది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నది. దీనివల్ల పీహెచ్సీల్లో 53 రకాల వైద్య సేవలకు వర్తించనున్నది. ఆరోగ్యశ్రీ అమలుపై ఇప్పటికే హైదరాబాద్లో పీహెచ్సీ వైద్యులకు శిక్షణను ఇవ్వడం జరిగింది.
అలాగే పీహెచ్సీలను ఆరోగ్యశ్రీ అనుసంధాన దవాఖానల జాబితాలో చేర్చడం పూర్తయింది. దీనికోసం ఆరోగ్యశ్రీ ట్ర స్టు నుంచి పాస్వర్డ్, లాగిన్ ఐడీలు పీహెచ్సీలకు చేరాయి. ఈ పథకం వర్తింపు వల్ల ఎలాంటి వ్యాధులకైనా ఎలాంటి మందులనైనా స్థానికంగానే పొందవచ్చు. సంబంధిత పీహెచ్సీ వైద్యులు బయటి నుంచి తెఫ్పించి రోగులకు మందులను అందజేస్తారు. దీనిద్వారా సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియాలాంటి చికిత్సలకు అవసరమైన మందులు లభించనుండటం గమనార్హం. ఆరోగ్య శ్రీ ద్వారా ఒక్క కేసు నమో దు అయితే రూ.2,100 మంజూరవుతాయి. ఇందులో 30 శాతం డబ్బులు వైద్యులకు ప్రోత్సాహకంగా అందనున్నా యి. మిగిలిన డబ్బులు దవాఖాన అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలో స్పష్టత రానున్నది. వైద్యులకు ప్రోత్సాహకాల వల్ల పీహెచ్సీలకు వచ్చే రోగులకు చికిత్సలు ఇచ్చేందుకు ఉత్సాహంతో ముందుకొచ్చే అవకాశం ఉంది.
ఇలా రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీల్లో అమల్లోకి రానున్న ఆరోగ్యశ్రీ వల్ల పేదలకు మందులు లభించడంతో పాటుగా దవాఖానలకు డబ్బులు కూడా సమకూరనున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో 27 పీహెచ్సీల్లో ఈ పథకం అమలుకానున్నది. 25న పాలెంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో స్థా నిక వైద్యులకు, సిబ్బందికి ఆరోగ్యశ్రీ అమలుపై శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం మీద పీహెచ్సీల్లో ఆరోగ్యశ్రీ అమలుతో పేదలకు ఎంతో లబ్ధి చేకూరనున్నది.