అయిజ, మే 24 : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద నిలకడగా కొనసాగుతున్నది. ఉపరితల ద్రోణి, అకాల వర్షాల కారణంగా కర్ణాటకలోని ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంటే, శృంగేరి, చిక్మగళూర్, వరనాడు ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు డ్యాంకు వరద వచ్చి చేరుతున్నది. మంగళవారం ఇన్ఫ్లో 15,665 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 356 క్యూసెక్కులుగా నమోదైంది. గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 100.855 టీ ఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 33.365 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 16 33 అడుగులకుగానూ ప్రస్తుతం 1609.00 అడుగులకు చేరినట్లు బోర్డు ఎస్ఈ నాగమోహన్, డ్యాంసెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకూ..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. టీబీ డ్యాం నుంచి వరద వచ్చి చేరుతున్నది. ఆనకట్టకు ఫ్లో 3,292 క్యూసెక్కులు ఉండగా ప్రధాన కాల్వకు 492 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 2,8 00 క్యూసెక్కులు దిగువన ఉన్న సుంకేశుల బ్యారేజీకి చేరుతున్నట్లు ఆర్డీఎస్ కర్ణాటక ఏఈ శ్రీనివాస్ తెలిపారు.