ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం
‘మన ఊరు – మనబడి’ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్రహం
ఎర్రవల్లి చౌరస్తా, మే 24 : ఉన్నతమైన ఇం గ్లిష్ మాధ్యమంలో విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయనున్నట్లు ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. మంగళవారం ధర్మవరం గ్రామంలో రూ. 16.74లక్షలతో ఆర్గార్లపాడు గ్రామంలో రూ.19.1లక్షలతో, పుటాన్దొడ్డి గ్రామంలో రూ.17.26లక్షలతో, బుడ్డారెడ్డిపల్లెగ్రామం లో రూ.17.26 లక్షలతో మన ఊరు-మనబడి పథకంలో భాగంగా పలు అభివృద్ధి ప నులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిచడంతోపాటు విద్యాప్రమాణాలు పెంపొందించే ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం ‘మన ఊరు -మనబడి’ పథకం ప్రవేశపెట్టిందని తెలిపా రు.
విద్యార్థులు అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు డిజిటల్ తరగతలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన చేపట్టే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వివరించా రు. కార్యక్రమంలో సర్పంచ్ మధునాయు డు, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ రంగారెడ్డి, మహేశ్వర్రెడ్డి, సుంకన్న, జయచంద్రారెడ్డి, నీటి శ్రీను, యుగంధర్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, కేశవపోగు రా జు, ఈదన్న, సర్పంచ్ పద్మమ్మ, ఎంపీటీసీ మల్లేశ్, సర్పంచ్ రవి, హుస్సేన్, ఇస్మాయిల్, నర్సింహులు, గిడ్డారెడ్డి, ఎర్రన్న, మల్లన్న, సుంకన్న, శివుడు, సూరి, శేఖర్, రవి, జగదీశ్రెడ్డి, మంద వెంకటేశ్, భాస్కర్, శ్రీరామ్, ప్రభుదాస్, పాండు, టీఆర్ఎస్ నా యకులు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ఇటిక్యాల, మే 24 : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని బుడ్డారెడ్డిపల్లెలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధ్ది పనులను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎర్రన్న, పంచాయతీరాజ్ ఏఈ పాండురంగతోపాటు ఉపాధ్యాయులు, గ్రా మస్తులు పాల్గొన్నారు.