వనపర్తి టౌన్, మే 23 : ఈ విద్యా సంవత్సరం వనపర్తి జిల్లా కేంద్రంలోని పీజీ కళాశాలలో ఇంజినీరింగ్ తరగతులు, పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజినీరింగ్ పరిపాలన భనవం కొనసాగుతాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో జేఎన్టీయూ అధికారులతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వీసీ కట్ట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్ట్రార్ మన్సూర్ హు స్సేన్తో సమావేశమయ్యారు. అయితే ఇంజినీరింగ్ కళాశాల భవనం నిర్మాణమయ్యే వరకు పీజీ కళాశాలలో తరగతుల నిర్వహణ ఉంటుందని, పరిపాలన భవనం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగుతుందని మంత్రి చెప్పారు.
వచ్చేవిద్యా సంవత్సరం ప్రారంభం నుం చి ఇంజినీరింగ్ 300 సీట్లతో, బీఫార్మసీ 60 సీట్లతో తరగతులు ప్రారంభమవుతాయని, ఈ ఏడాది ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్లోనే విద్యార్థులకు వనపర్తి కళాశాల ఆప్షన్ ఉంటుందన్నారు. ఇం జినీరింగ్లో సీఎస్ ఈ, ఏఐ, ఎంఎల్, ఈసీ ఈ, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ కోర్సులు ప్రారంభంకానున్నాయని మం త్రి చెప్పారు. అధికారులతో చర్చించి కలెక్టరేట్కు సమీపంలో నిర్మించే నూతన భవన నిర్మాణానికి సంబంధించిన లేఅవుట్ను మంత్రి ఆమోదించారు. సమావేశంలో జోనల్ కమిషనర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.