అయిజ, మే 23 : తుంగభద్ర నదిలో వరద ఉధృతికి ఓ వ్యక్తి గల్లంతై మృతదేహమై బయటపడిన సంఘటన మండలంలోని పులికల్ గ్రామ సమీపంలోని నాగల్దిన్నె వంతెన సమీపంలో చోటు చేసుకున్నది. ఎస్సై నరేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కర్నూల్ జిల్లా, ఎమ్మిగనూర్ మండలం, దైవందిన్నె గ్రామానికి చెందిన ఏడుగురు మిత్రులు కలిసి అయిజ మండలం, పులికల్ గ్రామానికి ఆదివారం మధ్యాహ్నం సమయంలో నాగల్దిన్నె వంతెన మీదుగా చేరుకున్నారు. సా యంత్రం 6 గంటల సమయంలో వారు వంతెన మీదుగా వెళ్దామని వెళ్తుండుగా, కురుమ సురేశ్ (26), బోయ రామకృష్ణ వంతెనపైకి మేము ఎక్కలేమని, నదిలోనే నడుచుకుంటూ వస్తామని నదిలో ప్రయాణించారు. మిత్రు లు వారించినా వినకుండా నదినీటిలో ప్రయాణించా రు.
తుంగభద్ర నదికి వరద ఉధృతి పెరగడంతో కురు మ సురేశ్, బోయ రామకృష్ణ కొట్టుకుపోయారన్నా రు. బోయ రామకృష్ణ ఈదుకుంటూ పాత బ్రిడ్జి పిల్లర్లపైకి చేరుకొని ప్రాణాలు రక్షించుకోగా, కురుమ సురేశ్ నీట మునిగి గల్లంతయ్యాడు. నీటిలో ఇద్దరు గల్లంతైన విష యం గమనించిన నాగల్దిన్నె గ్రామానికి చెం దిన జాలర్లు నాగరాజు, మ ల్లారెడ్డి పుట్టితో సంఘట నా స్థలానికి చేరుకొని రా మకృష్ణను ఒడ్డుకు చేర్చా రు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. విష యం తెలుసుకున్న అయి జ, నందవరం పోలీసులు జాలర్లతో ము మ్మరంగా గాలించారు.
సోమవారం మధ్యాహ్నం సురే శ్ మృతదేహం నాగల్దిన్నె పాతవంతెన సమీపంలో లభించిందని ఎస్సై నరేశ్కుమార్ తెలిపా రు. మృతదేహాన్ని గద్వాల దవాఖానకు తరలించి పంచనామా నిర్వహించి, బంధువులకు పార్థివదేహాన్ని అప్పగించినట్లు పేర్కొన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. సరదా కోసం వచ్చి తుంగభద్రనదిలో శవమై తేలడంతో కు టుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.